అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ఎస్ఈజడ్లో వున్న ఇన్నోవేర్ ల్యాబ్స్ కంపెనీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒక కెమిస్టు మృతిచెందాడు. మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ సీహెచ్.నరసింగరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని శిరిజాం పంచాయతీ ఎస్ఎన్.పురం గ్రామానికి చెందిన మేడపురెడ్డి దేవి ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మండలంలోని చుక్కపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని (స్కూల్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారు.
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ డివిజనల్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు బుధవారం తమ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే రోడ్డంతా అధ్వానంగా తయారైంది.
మన్యంలో పొగమంచు ఏమాత్రం తగ్గడం లేదు. క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు, చలి ప్రభావం కొనసాగుతున్నది.
జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం వలన మండల వాసులకు బస్ షెల్టర్లు లేకుండాపోయాయి.
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభమైంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్)కు సమయం ఆసన్నమైంది. భారత నౌకాదళం నుంచి 70కిపైగా యుద్ధనౌకలు, సబ్మెరైన్లు, కోస్ట్గార్డు నౌకలు...