జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను పూర్తి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. సర్పై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని తడిగిరి సచివాలయ పరిధిలోని బరెంగిబంద, కొండచీడిపుట్టు గ్రామాల రహదారుల నిర్మాణం పూర్తికాక మునుపే వర్షాలకు కోతకు గురయ్యాయి.
షెడ్యూల్డ్ ప్రాంతంలో అమలులో ఉన్న భూ బదలాయింపు చట్టాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు కదలిరావాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వరరావు పిలుపునిచ్చారు.
గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల పంటల్లో ప్రధానమైన కొర్ర(ఫాక్స్టెయిల్ మిలెట్) సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. ఆదివాసీలు పదేళ్ల క్రితం వరకు రాగి, సామ, కొర్రల పంటలను సమానంగా అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు.
ప్రస్తుతం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్గా పని చేస్తున్న గ్రూప్-1 అధికారి జి.బాలకృష్ణకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ తారాబు గ్రామస్థులు రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటాల్సిన దుస్థితి నెలకొంది.
విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.
జాతీయ రహదారి (ఎన్హెచ్-16)పై ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
సముద్రంలో బోటు బోల్తా పడడంతో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ ఇంతవరకూ తెలియలేదు.