చింతపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. దీంతో గిరిజన క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు.
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు. బుధవారం పాడేరు మొదలుకుని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.
ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో గల ప్రాథమిక పాఠశాలలకు చీకట్లు తొలిగాయి. సుమారు యాభై ఏళ్లుగా విద్యుత్ సదుపాయానికి నోచుకోని పాఠశాలల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్థుల కష్టాలు తీరనున్నాయి. రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న గిరిజనులకు ఉపశమనం లభించనుంది.
గిరిజన ప్రాంతంలో మార్చి నెలలో కురిసిన వర్షాలు కాఫీ పూతకు అనుకూలించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతలో సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో వర్షాలు కురుస్తాయి. కాఫీ పంటకు ఈ వర్షాలు అత్యంత కీలకం.
జీకేవీధి మండలం సీలేరు అటవీశాఖ పరిధిలో గల వలసగెడ్డ టేకు ప్లాంటేషన్కు బుధవారం ఉదయం ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి.
మండలంలోని ఆంధ్ర- ఒడిశా సరిహద్దు కొల్లాపుట్టు పంచాయతీ డోకిరిగుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక డోలీ మోతలు తప్పడం లేదు.
జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా బుధవారం పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.