• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

బడికి వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే..

బడికి వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే..

మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కన్నెలకట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ ప్రాణాలకు తెగించి గెడ్డ దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

ఉత్సాహంగా సీడ్‌బాల్స్‌ వెదజల్లే కార్యక్రమం

ఉత్సాహంగా సీడ్‌బాల్స్‌ వెదజల్లే కార్యక్రమం

జీకే వీధి మండలం సీలేరు అటవీశాఖ రేంజ్‌ పరిధిలో ని ధారకొండ, దుప్పులవాడ బీట్‌లో గురువారం 10 వేల సీడ్‌బాల్స్‌ వెదజల్లారు. ధారకొండ సెక్షన్‌ ఆఫీసర్‌ సతీశ్‌ ఆధ్వర్యంలో దుప్పిలివాడ పంచాయతీ దబ్బకోట గ్రామంలో నాలుగు వేల సీడ్‌బాల్స్‌ వెదజల్లారు.

కేజీబీవీల్లో సీట్లు ఫుల్‌

కేజీబీవీల్లో సీట్లు ఫుల్‌

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అంటే ఒకప్పుడు కేవలం డ్రాపవుట్‌ బాలికల కోసం ఏర్పాటు చేసినవనే భావన ఉండేది. కానీ అందులో సకల సదుపాయాలు కల్పిస్తూ ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండడంతో నేడు కేజీవీబీల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు.

దారి ఘోరం.. ప్రయాణం ప్రమాదకరం

దారి ఘోరం.. ప్రయాణం ప్రమాదకరం

జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలో కొత్తగా నిర్మించిన మాదిమళ్లు వంతెన వద్ద రోడ్డు ప్రస్తుతం బురదమయమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇది చిత్తడిగా మారింది. దీంతో ఇటుగా రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మన్యంలో ముసురు

మన్యంలో ముసురు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన్యంలో గురువారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లోనూ ముసురు ప్రభావంతో జల్లులు, ఒక మోస్తరు వర్షం కురిసింది. ముంచంగిపుట్టు మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ఒనకఢిల్లీ ప్రధాన రహదారిపై అడ్డంగా భారీ వృక్షం పడడంతో మూడు గంటల సేపు ట్రాఫిక్‌ స్తంభించింది. తాజా వర్షాలు ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు అంటున్నారు. కాగా గురువారం కొయ్యూరులో 32.4, అనంతగిరిలో 28.7, చింతపల్లిలో 27.7, పాడేరులో 27.1, పెదబయలులో 25.7, ముంచంగిపుట్టులో 24.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గాడితప్పిన ఐసీడీఎస్‌

గాడితప్పిన ఐసీడీఎస్‌

మండల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు గాడి తప్పింది. అండన్‌వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక సీడీపీవో ఏడాది కాలంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది సూపర్‌వైజర్లకు గాను ముగ్గురే ఉన్నారు. దీంతో ఆదివాసీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పోషకాహారం పూర్తి స్థాయిలో అందడం లేదు. సర్వసభ్య సమావేశంలో పలుమార్లు ఈ సమస్యను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం ఆదివాసీల పాలిట శాపంగా మారింది.

ఆకాంక్షిత జిల్లాలో ప్రగతి సాధించాలి

ఆకాంక్షిత జిల్లాలో ప్రగతి సాధించాలి

ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం(ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌)లో భాగంగా ఉద్దేశించిన ప్రగతిని సాధించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నీతి అయోగ్‌ ప్రతినిధి కార్తిక్‌ రెడ్డిలతో కలిసి బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం అమలు చేస్తున్నదన్నారు.

వీఈఆర్‌ అభివృద్ధికి  5000 కోట్లు

వీఈఆర్‌ అభివృద్ధికి 5000 కోట్లు

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి రూ.5 వేల కోట్లతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. నీతి ఆయోగ్‌ సూచన మేరకు వీఈఆర్‌లో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు పది జిల్లాలను చేర్చారు. ఇందులోనే భాగంగానే విశాఖపట్నం కేంద్రంగా ‘బే సిటీ’ పేరుతో ఫ్లాగ్‌ షిప్‌ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీని పరిధి 40 చదరపు కిలోమీటర్లు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు 25 కి.మీ. తీర ప్రాంతం ఇందులో ఉంది.

28, 29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ

28, 29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ

సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీపీ, జేసీ, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఘోరం

ఘోరం

నగర పరిధిలోని వడ్లపూడి-శ్రీనగర్‌ బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి