మన్యం వాసుల ఆరాధ్య దేవతపాడేరు మోదకొండమ్మ అమ్మవారి అనుపోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
మన్యంలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
గిరిజన ప్రాంతాన్ని ఆర్గానిక్ జోన్గా తీర్చిదిద్దేందుకు పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఆయా కమిషనర్లు సోమవారం వార్డుల విభజన ముసాయిదాను విడుదల చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘం వార్డుల విభజన ముసాయిదా ప్రతులను కమిషనర్ జంపా సురేంద్ర విడుదల చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు సోమవారం సాయంత్రం వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు కమిటీ చైర్పర్సన్ సీఎం రమేశ్ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. స్థానికేతరులను కూడా నిర్వాసితులుగా చూపించి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు.
పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థానిక అన్న క్యాంటీన్కు విశేష ఆదరణ లభిస్తోంది. రోజూ 1,200 మంది ఆకలి తీరుస్తోంది. రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఈ క్యాంటీన్ వరంలా పరిణమిస్తోంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలలో త్వరలో మాన్యువల్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికి ఇ-పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి.
సికిల్సెల్ ఎనీమియాను మరింత పక్కాగా నిర్ధారించే అత్యాధునిక సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ (కాక్) కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నగరంలో వీధికుక్కలు విజృంభిస్తున్నాయి.