అన్నదాతలకు బహుళ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ’ (ఏపీఎఫ్ఆర్)ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో భూమి కలిగిన ప్రతి రైతు విధిగా ఏపీఎఫ్ఆర్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
జీకేవీధి మండలం సీలేరు జల విద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో గురువారం విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు.
కోళ్లకు వ్యాప్తి చెందే బర్డ్ ఫ్లూపై ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి(డీఏహెచ్వో) డాక్టర్ వి.జయరాజ్ సూచించారు.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి అధికారులు మాత్రం అమరావతిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అది ప్రస్తుతానికి లాభదాయకం కాకపోయినా మెట్రో నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్టును పట్టాలపైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్లో సేవల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఓపీ (అవుట్ పేషెంట్) చీటీ ఇచ్చేందుకు రెండు కౌంటర్లు, ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ కోసం నర్సింగ్ సిబ్బందిని నియమించినప్పటికీ ఇక్కట్లు తప్పడం లేదు. ఓపీ రిజిస్ర్టేషన్ కోసం తీసుకువచ్చిన నూతన విధానంతో ఈ సమస్య రెట్టింపు అయినట్టు చెబుతున్నారు.
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. పెండింగ్ ట్రాఫిక్ ఈ-చలాన్లను కట్టించేందుకు వాహన చోదకులను బలవంతం చేస్తున్నారు. తమ మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదని, తర్వాత కడతానని ఎవరైనా చెబితే...‘ఏం ఇబ్బంది లేదు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు మే చివరి నాటికి పూర్తిచేస్తామని కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. జీవీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఆరిలోవ సెక్టార్-3 దుర్గానగర్లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంచంపై అచేతనంగా పడి ఉన్న ఆమె ముక్కు, చెవి నుంచి రక్తస్రావం కావడం, శరీరంపై బంగారు ఆభరణాలు, ఇంట్లో నగదు కనిపించకపోవడంతో సొత్తు కోసం ఎవరో హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ హర్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్న కాపు రమణకు దుర్గాబజార్ పాత పోలీస్ స్టేషన్ సమీపాన సొంత ఇల్లు ఉంది. రమణ భార్య లక్ష్మి (45) చీటీలు నిర్వహిస్తుంటారు.
ఐఎఫ్ఆర్కు విస్తృత ఏర్పాట్లు
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై బుధవారం ఆంధ్రా, ఒడిశా అధికారులు సీలేరు ఏపీ జెన్కో అతిథి గృహంలో సమావేశమయ్యారు.