వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగిన శ్రీపుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి.
ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై నగరవాసుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
పదో తరగతి ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రం విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది.
ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ‘ఆంధ్రజ్యోతి’...వాటి పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకుసాగుతోంది.
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మూడు రోజుల మగశిశువు మృతిచెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బిడ్డ మృతికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మృతిచెందిన పసికందు తండ్రి వేగి శ్రీనివాసరావు చెప్పిన వివరాలిలా వున్నాయి.
వారు ముగ్గురూ స్నేహితులు. వేర్వేరు గ్రామాలు అయినప్పటికీ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒకరి గ్రామంలో జరిగిన అమ్మవారి జాతరకు మిగిలిన ఇద్దరూ హాజరయ్యారు. ఉత్సాహంగా గడిపిన తరువాత ఒకరిని అతని ఊరులో దిగబెట్టడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పేదలకు రూ.5లకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు సిద్ధమయ్యాయి. ఇవి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యేసుకీస్తు శిలువపై ప్రాణాలర్పించిన రోజైన గుడ్ ఫ్రై డేను జిల్లాలోని క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
మన్యంలో వాతావరణం మార్పులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఉదయం వేళల్లో మాత్రం పొగమంచు కురుస్తున్నది.
పాడేరు మన్యంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గూడెంకొత్తవీధి, ముంచంగిపుట్టు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది.