నర్సీపట్నం డీసీసీబీ బ్రాంచి పరిధిలోని చెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ రెండేళ్లుగా కొనసా....గుతోంది. సీఈవోపై జరిగిన సెక్షన్ 51 విచారణలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారణ అయినప్పటికి చర్యలు తీసుకోకుండా మూడేళ్లుగా అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున పీఎం శ్రీ పథకంతో జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల రూపురేఖలు మారాయి. వికసిత్ భారత్లో భాగంగా సమగ్ర శిక్ష విభాగం అధికారులు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో 23 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి, రూ.6.24 కోట్లతో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టారు.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ముంచంగిపట్టులో శనివారం జరిగిన వారపు సంతలో బుడియాలు సందడి చేశారు.
చింతపల్లిలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోయింది. కార్యాలయం, ల్యాబ్ భవనాలు శిథిలమయ్యాయి. పట్టు పరిశ్రమకు చెందిన భూములు నిరుపయోగంగా పడి వున్నాయి. ప్రయోగాలు, పట్టు గూళ్లు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయాయి. ఏడాదికి ఒకసారి మొక్కుబడిగా తక్కువ పరిమాణంలో మూగ, టస్సార్ పట్టు సాగు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు ఉపాధి దూరమైంది.
మండలంలోని చౌడుపల్లిలో అభ్యుదయ రైతుల పెరటిలో అన్సీజన్లో ఓ పనస చెట్టుకు రెండు పండ్లు కోతకు వచ్చాయి.
కుటుంబపోషణ కోసం పశుపోషణ రైతులు, పశువుల వ్యాపారుల వద్ద కూలీలు పనిచేస్తున్న తమను తగరపువలసకు చెందిన శేఖర్ అనే వ్యక్తి నమ్మించి, ఆధార్ కార్డులు తీసుకొని, ఇతర రాష్ట్రాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నాడని పలువరు బాధితులు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పశువుల సంతల్లో కూలీలుగా పనిచేస్తున్న దేవర నాగేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్, బర్ల శ్రీను, డి.లక్ష్మణ్, కె.తాతాజీ, రామ్ ప్రసాద్ నేతృత్వంలో పలువురు నక్కపల్లి వచ్చిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.