స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నాలుగోసారి అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మచిలీపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు సభ్యత మరిచాడు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
చెరువులో పూడికతీత పనుల్లో భాగంగా పారతో మట్టి తవ్వుతుండగా పేలుడు సంభవించి మహిళా కూలీ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటనలో ఆమె కుడి కన్ను చూపు కోల్పయింది. ఎడమ కంటికి దెబ్బలు తగిలాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అధికారులే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతనంగా ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
వివాహ వేడుకలో ఐదు లక్షల రూపాయల నగదు, పావుతులం బంగారం వున్న పెళ్లి కుమార్తె సోదరి హ్యాండ్ బ్యాగును ఓ వ్యక్తి లాక్కొని ఒక్క ఉదుటన ఉడాయించాడు. దీంతో అక్కడున్న వారు కేకలు వేస్తూ అతని వెంట పడినప్పటికీ చీకటిగా వుండడంతో ఎటు వెళ్లాడో కనిపించలేదు. అనంతరం 112 నంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి మూడు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను శుక్రవారం మధ్యాహ్నం రూరల్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
నగరంలో ఎకో టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కును ముస్తాబు చేస్తున్నారు. అల్లూరి, గంటందొరల సమాఽధులున్న ప్రాంతంలో తుప్పలు తొలగించి శుభ్రం చేయించి, కొత్తగా మొక్కలు నాటించారు. శనివారం ఇక్కడ నిర్వహించే అల్లూరి జయంతి కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శుక్రవారానికి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై వుంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తరువాత అడపాదడపా జల్లులు పడుతూనే వున్నాయి. మొత్తం మీద జిల్లా అంతటా ముసురు వాతావరణం నెలకొని వాతావరణం చల్లబడింది.