మండలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించిన 4,250 ఎకరాల ల్యాండ్ బ్యాంకు భూములను బుధవారం ఏపీఐఐసీ అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. మూడు నెలల కిందట పైడిపాల, పాపయ్యపాలెం, పెద్దిపాలెం, బూరుగుపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాల డి.పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములను ల్యాండ్ బ్యాంకు కింద అధికారులు గుర్తించారు. అయితే ఆయా రైతులతో ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదు.
జిల్లాలో జరుగుతున్న గృహ గణన సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనాభా గణన విభాగం జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, జిల్లా ఇన్చార్జి జోషిణి బుధవారం ఉదయం కలెక్టర్ను ఆమె చాంబర్లో కలిశారు. గృహ గణన ఇంతవరకు 80 శాతం పూర్తయ్యిందని, ఈ నెల 30వ తేదీనాటికి శతశాతం గృహ గణన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఆదేశించారు. 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తాళాలు వేసి వున్న ఇళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపడతామని జాయింట్ డైరెక్టర్ దయాసాగర్ వివరించారు.
జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులకు తారు కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ మధ్య మూడున్నర నెలల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో గల్ఫ్ దేశాల నుంచి తారు దిగుమతి ఆగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా మార్చి చివరినాటికి పూర్తికావాల్సిన పనులు చాలా వరకు అసంపూర్తిగా వుండిపోయాయి. మిగిలిన పనులను సైతం కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమెను ఏకంగా అంతమొందించేందుకు ఒడిగట్టాడు. ఈ సంఘటనకు సంబంధించి భీమిలి సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తీవ్రమైన ఉక్కపోతతో నగర ప్రజలు బుధవారం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేఘాలు ఆవరించినా వర్షం కురవలేదు. గాలిలో తేమశాతం 80 వరకు నమోదుకావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
నగరంలోని రైతుబజార్లలో అన్నిరకాల కూరగాయలు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి స్టాల్లో మామిడి పండ్లే విక్రయిస్తున్నారు. కొన్ని స్టాళ్లలో రైతులకు బదులు అనర్హులు దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో ఆకస్మిక తనిఖీల ద్వారా తెలుసుకోవసిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై పడింది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ఆర్ఐవో మురళీధర్ తెలిపారు.
స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందుతున్న విశాఖలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అత్యంత కీలకమైన తాగునీటి సరఫరాపై దృష్టిసారించారు. ఇప్పటికే నార్త్ వెస్ట్ సిటీలో అమలు చేస్తున్న నిరంతర నీటి సరఫరాను నగరమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు.
బిల్లుల భారం తగ్గించుకునేందుకు నగర పరిధిలోని బోధనాస్పత్రులు సౌర విద్యుదుత్పత్తి బాట పట్టాయి. ఈ మేరకు 2018లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో సోలార్ ప్యానల్స్ను ఒక ప్రైవేటు సంస్థ 2018లో ఏర్పాటుచేయించింది. అందుకయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించింది. అందుకు ప్రతిగా ఆయా ఆస్పత్రుల నుంచి యూనిట్కు రూ.4 చొప్పున సదరు సంస్థ తీసుకుంటోంది. సాధారణంగా ఈపీడీసీఎల్ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు అవుతోంది. అదే ఆ సంస్థ నాలుగు రూపాయలకు అందిస్తున్నట్టు లెక్క. ఈ విధంగా ఆయా ఆస్పత్రులు వినియోగించే విద్యుత్పై యూనిట్కు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చు తగ్గుతోంది.
గాజువాక నియోజకవర్గంలో ఐటీ, ఇతర పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులను కోరినట్టు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తన ఛాంబర్లో ఎమ్మెల్యే పల్లాతో కలిసి గాజువాక నియోజకవర్గ సమస్యలపై పలు శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.