రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం పాడేరు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
గంజాయి వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన డుంబేరి సతీశ్కుమార్కు చెందిన రూ. 34 లక్షల 93 వేల 031 విలువ గల ఆస్తిని ఫ్రీజ్ చేసినట్టు పాడేరు డీఎస్పీ ఆర్ఆర్వీఎస్.అభిషేక్ తెలిపారు.
జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా అధికారులు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.
మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది.
గిరిజన ప్రాంతంలో గంజాయి సాగుకు ఆదివాసీలు దూరంగా ఉండాలని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కోరారు. శనివారం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కోటగున్నలు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు విద్యార్థుల నుంచి స్పందన కరువైంది.
మునిసిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జనాభా, భౌగోళిక విస్తీర్ణం పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ప్రకారం నర్సీపట్నం మునిసిపాలిటీ జనాభా 61,540. వార్డుల పునర్విభజకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 64లో మునిసిపాలిటీ జనాభా 60 వేల నుంచి 80 వేల మధ్యలో ఉంటే 40 వార్డులు వుండాలి. దీంతో నర్సీపట్నం జనాభా 60 వేలు దాటి వున్నందున వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరుగుతుంది.
మండలంలోని సోముదేవుపల్లి వద్ద కోతకు గురవుతున్న వరహా నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.95 కోట్లు మంజూరు చేసిందని, కొద్ది రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి, పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన డీసీఈ ఆంజనేయులు, ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈ వి.బాలసూర్యంతో కలిసి సోముదేవుపల్లి వద్ద వరహా నది గట్టును పరిశీలించారు.
గడచిన ఆర్థిక సంవత్సంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పది సబ్రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి 2025-26లో రూ.331.6 కోట్లు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, రూ.351.62 కోట్లు రాబడి వచ్చింది.
వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు, విహారయాత్రలతోపాటు అనేకమంది సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో రైళ్లకు తాకిడి బాగా పెరిగింది.