భూమి మ్యూటేషన్కు రూ.20 వేలు లంచం తీసుకుంటూ మారేడుపూడి వీఆర్వో ఎం.సూర్యనారాయణ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండు దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలం వివాదాస్పదంగా మారడంతో ఈ దుకాణాలకు నిర్వహించిన టెండర్ను రద్దు చేస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దుకాణాల అద్దెకు నిర్వహించిన టెండర్లో కొందరు వ్యాపారులు రింగ్ అయు, గతంలో నెలకు రూ.2.70 లక్షలు ఉన్న అద్దె కంటే తక్కువగా నెలకు రూ.1.30 లక్షల అద్దెకు దుకాణాలు దక్కించుకోవడం, ఇది ఆరోపణలకు దారితీయడంతో ఈ టెండరు రద్దు చేసి మళ్లీ టెండరు పిలవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ‘రాక్రీట్’ కంపెనీ మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించింది.
హైందవ ధర్మ పరిరక్షణ, సింహాచలం క్షేత్ర మహాత్మ్యం ప్రచారానికి ఉద్దేశించిన నృసింహ దీక్షలకు డిసెంబరు 3వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత ప్రకటించారు.
నగరంలో ప్రధాన రహదారులను పీపీపీ యాన్యుటీ/హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ స్టీల్ప్లాంటు పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టంచేశారు.
అభివృద్ధి పనుల కోసం ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)కు మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు.
జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మంత్రివర్గ ప్రతిపాదన ప్రభుత్వానికి అందిన సంగతి తెలిసిందే. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం కలెక్టర్ విజయకృష్ణన్ సమగ్ర నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ముసాయిదా నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
మండలంలోని అడ్డరోడ్డులో నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్వహిస్తున్న జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ అనే ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ను గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్ చేశారు. ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి హైమావతి, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వీరజ్యోతి సిబ్బందితో పాటు ఈ ల్యాబ్ను సందర్శించి నిర్వాహకురాలు ఉమకు ల్యాబ్ను సీజ్ చేస్తున్నట్టు నోటీసు అందజేశారు.
మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలో చల్లని వాతావరణం నెలకొనడమే కాకుండా మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 54 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని మండలాల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. మరికొన్ని మండలాల్లో వరి గింజకట్టి కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వరి కోతలు పూర్తి చేసుకొని రైతులు కుప్పలు వేసుకుంటున్నారు.