ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్పై జన సైనికులు, వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్పై జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఇటీవల పాయకరావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి శనివారం వేకువజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్లో ఉన్న నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు.
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని శనివారం ఉదయం నుంచి గోదావరి డెల్టాకు విడుదల చేసినట్టు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు.
గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఆనందం కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
ఓటరు జాబితాల నవీకరణలలో భాగంగా చేపడుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్బీ.జోషి ఆదేశించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీని ముసురు వదలడం లేదు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు.
ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది.
చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రామేశ్వరాన్ని సస్పెండ్ చేస్తూ గురుకుల కార్యదర్శి ఎం.గౌతమి ఉత్తర్వులు జారీచేశారు.
గిరిజనుల జీవన శైలిలో మార్పు, ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి చోటెన్ ధెందుప్ లామా అన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.