రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి పథకం’ కింద ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఆయాన బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అనకాపల్లి డిపో నుంచి నడిచే బస్సుల్లో 110 శాతం ఓఆర్ నమోదు అవుతున్నది. అయితే పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని బస్సులు కేటాయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న గిరిజన ప్రాంతంలో సీప్లేన్ సేవలు త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సీప్లేన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్నది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో పనులు వేగవంతమయ్యాయి.
అనకాపల్లి మండల పరిధిలో జిల్లా ఖనిజ నిధుల (డీఎంఎఫ్)తో పంట కాలువల్లో చేపట్టిన పూడికతీత పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కూటమి నేతలు సాగునీటి సంఘాల పేరుతో నామినేషన్ విధానంలో తమ అనుచరులకు ఈ పనులు కట్టబెట్టినట్టు తెలిసింది. పనులు సరిగా చేయకుండా సగానికిపైగా నిధులు మింగేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో అటు ఏజెన్సీని ఆనుకొని వున్న మండలాల మొదలు ఇటు సముద్ర తీరంలోని మండలాల వరకు గురువారం ఎండ మండిపోయింది. సాధారణంకంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.
మత్స్యగెడ్డలో చేపల వేటకు వెళ్లి గురువారం ఒకరు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు(34) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు.
మండలంలోని గొందపాకలు పంచాయతీ యర్రవరం, యర్నాపల్లి గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు గిరిజనులకు మలేరియా నిర్ధారణ అయింది. ఆదివాసీలు ఇంటికి ఒకరు చొప్పున మంచానపడి వైద్యం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. ఎండల తీవ్రతపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న వేతనదారులకు ఎండ దెబ్బ తగలకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
మండలంలో వరహా నదిపై పందూరు వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు మొదలై, నదిలో వరద ప్రవాహం పెరిగేనాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 14 ఏళ్ల నుంచి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇక్కట్లు తొలగిపోతాయి.
వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వేడి గాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దీనికితోడు తీవ్ర వడగాడ్పులు వీచడంతో జనం అల్లాడిపోయారు. జిల్లాలో 24 మండలాలకుగాను 17 మండలాల్లో 40 డిగ్రీలకుపైబడి ఉష్ణోగత్రలు నమోదుకావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతున్నది.
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను అధికారులు పట్టుకున్నారు. వీరికి నోటీసులు అందజేసి, బోట్ల లైసెన్సులు రద్దు, జరిమానా విధింపుతోపాటు ప్రభుత్వం అందించే రూ.20 వేల మత్స్యకార భరోసాను రద్దు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా మత్స్యశాఖ అధికారి శృతి తెలిపిన వివరాలిలా వున్నాయి.