జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ నుంచి ఇంతవరకు సాధారణ వర్షపాతంలో సగం మాత్రమే కురిసింది. ప్రస్తుత సమయానికి 70 శాతం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తికావాల్సి వుండగా.. ఇంతవరకు ఐదు శాతం విస్తీర్ణంలో కూడా నాట్లు వేయలేదు. అదికూడా విద్యుత్ మోటార్లు వున్న బోర్లు, రిజర్వాయర్ల ఆయకట్టు కింద మాత్రమే అరకొరగా నాట్లు పడుతున్నాయి. మిగిలిన వర్షాధార భూముల్లో వరితోపాటు ఇతర పంటలు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.
మండలంలోని వెంకన్నపాలెం జంక్షన్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆర్అండ్బీ స్థలంలో ఎప్పటి నుంచో వున్న బస్ షెల్టర్ను కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన కూడలి కావడంతో ఇక్కడ రోడ్డు పక్కన సెంటు స్థలం రూ.50 లక్షలు పలుకుతున్నది.
అనకాపల్లి- సోలాపూర్ మధ్య ఇప్పటి వరకు నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలు, శనివారం నుంచి వారాంతపు రెగ్యులర్ సర్వీసుగా నడవనున్నది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ కి సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
ఈనెల 22 నుంచి నిర్వహించే ఓటర్ల జాబితాల పరిశీలనకు ప్రత్యేక ప్రచార దినాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పాడేరు ఘాట్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా తుప్పలు పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఘాట్లో మలుపుల వద్ద స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాల ప్రమాదాలు సర్వసాధారణమైంది. దీంతో ప్రయాణికులు, చోదకులు, పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది.
కొయ్యూరు మండలంలోని పొర్లుబంద గ్రామానికి చెందిన గర్భిణిని మూడు కిలోమీటర్లు కొండలు, వాగులు దాటి డోలీపై ఆస్పత్రికి తరలించారు. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిని రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీపై తరలించేందుకు శుక్రవారం కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. తమకు ఎన్నాళ్లీ తిప్పలని వారు వాపోయారు.
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందుతోంది. కూటమి ప్రభుత్వం ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణులు పోస్టులను భర్తీ చేసింది. దీంతో గర్భిణులకు ప్రతి రోజూ ఆరోగ్య తనిఖీలు, అలా్ట్రసౌండ్ స్కానింగ్లు చేస్తున్నారు.
ప్రతి గడపలో సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తున్నదని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ అన్నారు.