దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిర స్కరణలు ఏమాత్రం ఆగడం లేదు. వేలంలో బోర్డు అధికారులు సూచించిన ధరకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో వాటిని అధికారే నోబిడ్ చేస్తున్నారు. అలాంటివి బుధవారం వేలానికి వచ్చిన బేళ్లలో దాదాపు 35 నుంచి 40శాతం ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్టు రెసిడెన్షి యల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల బదిలీలకు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. ఒకటిన్నర దశాబ్దాలుగా కేజీబీవీల్లో బదిలీలు లేవు.
ఇంటి పన్నుల ముందస్తు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా మునిసిపాలిటీల తరహాలో పంచాయతీల్లో కూడా ముందుగా ఇంటి పన్నుచెల్లిస్తే ఐదు శాతం రాయితీ (రిబేటు)ని కల్పించింది.
ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, ప్రజల సంక్షేమం, భవిష్యత్ లక్ష్యాలపై సమీక్ష కోసం గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావస్తుండగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ఇది ఏడోసారి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.
సహకార శాఖలో అక్రమాలపై చేపట్టిన విచారణ అడుగు ముందుకు పడటం లేదు. డీసీసీబీలో చోటుచేసుకున్న రుణ కుంభకోణంపై విచారణాధికారిగా ఏడాది క్రితం నియమితులైన ఏసీ గౌరీశంకర్ విచారణను కొలిక్కి తీసుకురాలేదు.
‘కేవలం సమీక్షలతోనే సరిపెట్టే వ్యక్తిని కాదు.. క్షేత్రస్థాయిలో సమస్యలనూ తెలుసుకుంటా. టన్నెల్ లోపల కార్మికుల కష్టాన్ని స్వయంగా చూస్తా’ అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రిపూట వెలిగొండ టన్నెల్లోకి వెళ్లారు.
నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న ఆ పార్టీ సొంత కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒంగోలులో నిర్మించ నున్న కార్యాలయ భవనానికి బుధవారం పునాదిరాయి వేయనున్నారు.
డీజిల్ సమస్య సద్దుమ ణుగుతున్న సమయంలో కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు పెట్రోలు బంకుల యజమానుల నిర్వాకంతో మళ్లీ కొరత వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. డీజిల్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం బంకు యజమా నులకు కొన్ని షరతులను విధించింది.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మెరుగైన వైద్యసేవలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో 104 సంచార వైద్య వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.