వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే నాలుగేళ్ల క్రితం నుంచి కారుమంచి మేజర్ ఆయకట్టు కర్షకులు పడుతున్న కష్టాలు త్వరలోనే కడతేరనున్నాయి. ఆయకట్టు రైతులకు, ప్రజలకు తీయటి కబురును ప్రజా ప్రభుత్వం అందించింది. నాలుగేళ్ల క్రితం కోతకు గురై క్వారీలో కుప్పకూలిన మేజర్ కట్టను పునరుద్ధరించటానికి లైన్క్లియర్ అయ్యింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం బస్సు ప్రమాద బాధితులను ఏపీ మంత్రులు పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లే దాకా చంద్రబాబు సర్కార్ బాధ్యత తీసుకుంటుందని వారు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందన్న నెపంతో కన్న కూతురిని తండ్రి కడతేర్చిన ఘటన గురువారం త్రిపురాంతకంలో చోటుచేసుకుంది.
మార్కాపురం మండలం రాయవరం వద్ద రోడ్డు ప్రమాదంలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి బాధాకరంగా ఉన్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీకాలనీకి చెందిన అంబటి అనిల్ (26), అతని కుమారుడు లియోన్ (5 నెలలు) మృతి చెందారు. అనిల్ భార్య సౌజన్య ప్రాణాలతో బయటపడ్డారు.
కళ్లు తెరిచేలోపు ఎగసిపడే మంటలు.. ఎవరి నోట విన్నా ఏడుపులు, కేకలు. బతుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న బస్ ప్రమాద బాధితుల్లో కొందరు ఒంగోలు జీజీహెచ్కు చేరారు. 16 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడి అధికారులు అప్రమత్తమై అవసరమైన వైద్యం ప్రారంభించారు.
ఇవాళ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. బస్సు ప్రమాద ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం.