వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు.
మార్కాపురం జిల్లాలో శనివారం జరిగిన రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబునాయుడు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. తొలుత నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు చరిత్రాత్మకం అని చెప్పవచ్చు.
‘మార్కాపురం జిల్లా ఇచ్చా. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్లో చేర్చా. వెలిగొండను పూర్తి చేస్తా.. ఇన్ని ఇచ్చిన నాకు మీరు అండగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. వెలిగొండ నిర్వాసితులకు పరిహారం కింద మంజూరు చేసిన రూ.905 కోట్లలో శనివారం రూ.300 కోట్లను సీఎం దోర్నాల మండలం గంటవానిపల్లిలో విడుదల చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పనిసర్దుబాటులో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వుల ప్రక్రియ ముందుకు సాగకుండా పోయింది. టీచర్ల సర్దుబాటుకు సంబంధించిన జాబితాలు ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు.
పొగాకు మార్కెట్ పరిస్థితిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి విచారణ చేసి ఆదేశాలు ఇచ్చినా మీలో మార్పు రాదా. మీ ఇష్టానుసారం కొనుగోలు చేస్తామంటే కుదరదు’ అంటూ పొగాకు కంపెనీల బయ్యర్లపై కలెక్టర్ రాజాబాబు మండిపడ్డారు. అధికోత్పత్తిని సాకుగా చూపించి ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించడం, బేళ్లను తిరస్కరించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతు కంట కన్నీరు వస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై సెక్షన్ 51 విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి నియమితులయ్యారు. ఆ మేరకు సహకార శాఖ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంలో దాదాపు మూడు మాసాలకుపైగా పలు స్థాయిల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు కీలక అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు.
జిల్లావ్యాప్తంగా ఆది వారం పల్స్ పోలియో జరగనుంది. అందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 28 మండలాల్లో ఉన్న 65 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లతోపాటు ఒంగోలు అర్బన్, కందుకూరు మునిసిపాలిటీ, చీమకుర్తి, అద్దంకి నగరపంచాయతీల్లో చుక్కల మందుకు ఏర్పాట్లు చేశారు.
వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు.
నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు.