ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యద్దనపూడి మండల పరిధిలో పూనూరు గ్రామంలో వేగంగా రెండు ఆరోగ్య సేవా భవనాలను నిర్మిస్తున్నారు.
మనస్తాపానికి గురైన వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పర్చూరు మండలం ఇనగల్లు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి బాపట్ల - ప్రకాశం జిల్లా సరిహద్దు ఉప్పుగుండూరు సమీపంలోని జాతీయ రహదారిలో చోటుచేసుకుంది.
మార్కాపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జీవీఎస్ నారాయణరావు అన్నారు. సోమవారం విజయవాడలోని హుడా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికే ప్రజాదర్బార్ అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు.
గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఉన్న ఇండోసోల్ సోలార్ పరిశ్రమ కోసం చేవూరు చెరువు నుంచి ఏర్పాటు చేసిన పైప్లైను అగ్నికి ఆహుతైంది. ఇండోసోల్ సోలార్ పలకల తయారీకి అవసరమైన నీటిని చేవూరు చెరువు నుంచి తరలించుకునేందుకు వీలుగా కొద్దినెలల క్రితం పైప్లైను వేస్తుండగా గ్రామ రైతులు అడ్డుకున్నారు.
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ఎవరు మృతి చెందినా అంతిమ సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సింగరాయకొండ, మండలంలో పాకల బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 14, 15 తేదీల్లో అబ్చురపరిచేలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం పాకల బీచ్లో కలెక్టర్ రాజాబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీని ఆవిష్కరించారు.
అనాదిగా చీకట్లో మగ్గుతున్న గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గిరిజన తాండాలో సోలార్ లైట్లను శుక్రవారం పొద్దుపోయాక లబ్ధిదారులతో కలసి మంత్రి ప్రారంభించారు.
దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు తొలి అడుగు పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్ పథకం అమలుకు టెండర్లు ఖరారయ్యాయి. గతంలో అనేకసార్లు టెండర్లు పిలిచినప్పటికీ అనివార్య కారణాలతో ఖరారు కాకుండా రద్దయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. అందులో భాగంగా అమృత్ పథకం-2 అమలుకు శ్రీకారం పలికింది. పదిరోజుల క్రితం టెండర్లు ఖరారయ్యాయి.