దక్షిణాది పొగాకు మార్కెట్లో ఇప్పటివరకు భారీగా ఉంటున్న నోబిడ్లకు బుధవారం బ్రేక్ పడింది. రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా పెరిగింది. ఈ రెండు అంశాలలో గతం కన్నా పరిస్థితి మెరుగైంది.
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. స్టైఫండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ పదవీకాలం పెంపును ఆపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు చేపట్టిన సమ్మె బుధవారం కూడా కొనసాగింది.
జిల్లాలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో అక్కడక్కడా మలేరియా కేసులు బయటపడుతున్నాయి. పనుల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి మలేరియా ఉన్నట్లు తేలింది.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మార్కాపురం వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఉదయం 11.45 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం కలెక్టరేట్కు చేరుకుంటారు.
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడులో దర్శి ఎకై్ౖసజ్ సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు.
దర్శి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 22న ట్రయల్ రన్కు ముహూర్తం ఖరారు చేసింది. ఈమేరకు జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.
మరోసారి వేసవి వాతావరణం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆపై వేడిగాలులు కూడా వీస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది.
దక్షిణాదిలోని పొగాకు వేలం కేంద్రాల్లో మళ్లీ నోబిడ్లు భారీగా పెరిగాయి. సగటు ధరతోపాటు రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా తగ్గిపో యింది. ఇటీవల ఈ ప్రాంత పొగాకు మార్కెట్లోనే సోమవారం నోబిడ్లు తగ్గడంతోపాటు సగటు ధర, రోజువారీ కొనుగోలు పరిమాణం ఆశాజనకంగా కనిపించింది.
జిల్లావ్యాప్తంగా స్వాతం త్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.