జిల్లాలో బుధవారం నుంచి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగు తున్నాయి. అద్దంకి పట్టణానికి సమీపంలోని కొండ వద్ద 960 కుటుంబాలకు టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి.
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలువడమే తె లుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఇటీవల కంభం పట్టణానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, వారికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.10లక్షల చెక్కులను ఆ కుటుంబాలకు అందించారు.
ప్రతి కుటుంబం ఆర్థిక సమానత్వం పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్లో సోమవారం పీ4 ప్రథమ వార్షికోత్సవం జరిగింది.
ప్రతి పేద కుటుంబానికి స్వంతంగా ఇల్లు కల్పించటమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మున్సిపాల్టీ 7వ వార్డు పరిధిలోని చాకిరాల వద్ద పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు.
మొక్కజొన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో సుమారు 10 ఎకరాల పైచిలుకు పంట నష్టం జరిగింది.
త్రిపురాంతకం మండల కేంద్రంలో ఈ నెల 26న కన్న తండ్రే కాలయముడై కన్న కూతురిని హత్య చేసిన విషయం తెలిసిందే.
రామతీర్థం తిరునాళ్ల సంబరాల సందడి మొదలైంది. మంగళవారం మందిరాల సంబరాలు చీమకుర్తిలో, బుధవారం రామతీర్థంలో తిరునాళ్ల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది.
మార్కాపురం జీజీహెచ్లో బస్సు ప్రమాద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. 14 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. శనివారం ఉదయం వారి బంధువులకు అప్పగించారు.