ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు చెల్లిస్తేగాని జరగని ఆపరేషన్లు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో ఉచితంగా, విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు చెప్పారు.
పొగాకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ స్వామి చెప్పారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష (ఏపీఈఏపీ సెట్) ఫలితాలు ఎట్టకేలకు బుధవారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ ఫలితాల్లో అర్హత ర్యాంకుల సాధనలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు.
వెలిగొండ నిర్వాసితుల్లో ప్రజాప్రభుత్వం పట్ల వ్యక్తమైన సానుకూలత, యావత్ పశ్చిమ ప్రాంత ప్రజల్లో ప్రాజెక్టు పూర్తిపై నమ్మకం ఏర్పడటాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సరికొత్త డ్రామాకు శ్రీకారం పలికారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహణ పట్ల క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్య క్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మ కంగా నిర్వహించగా మన రాష్ట్రంలో గతనెల 15వతేదీ నుంచి ప్రారంభించింది.
జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30 గంటల నుంచే స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఆయాప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు నగదును అందజేశారు.
గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు భూముల్లో చేపల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. రిజర్వాయర్ ఒడ్డున ఉన్న తమ్మవరం, అనమనమూరుల్లో పెద్దఎత్తున వీటిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సుమారు 80 ఎకరాల్లో పనులు జరుగుతు న్నాయి.
పొగాకును కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. బుధవారం టంగుటూరులోని వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
భర్త చనిపోయిన 40 రోజుల వ్యవధిలోనే పెన్షన్ అందజేసి ఆ కుంటుంబానికి బాసటగా ప్ర జా ప్రభుత్వం నిలిచిందని ము స్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ షంషుద్దీన్ చెప్పారు.