ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు టీడీపీ నేతలు చెప్పారు.
ఆత్మహత్యకు యత్నిస్తే మహిళా పోలీస్ తలకు తీవ్ర రక్తగాయమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.అనంతరాజు చెప్పారు.
కీలకమైన ఘట్టం.. శాసనసభ్యులంతా కలిసి గళం విప్పి లక్ష్యం మేరకు నిధులు సాధించాల్సిన తరుణం. శాసనభ వార్షిక బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏడాదికి మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా బడ్జెట్ సెషన్ అత్యంత కీలకమైనది.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతోపాటు స్థానికంగా ఆదాయ వనరుల పెంపుపై దిశానిర్దేశం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో నిర్వహించతలపెట్టిన బీచ్ ఫెస్టివల్కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు ఆ ప్రాంత కీలక నేతలు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
రాష్ట్రంలో వచ్చేనెల 16 నుంచి ప్రారంభమవుతున్న 10వతరగతి పరీక్షల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమూల మార్పు లకు నాంది పలికింది.
‘మెను సక్రమంగా అమలు చేయడం లేదు, చాలీచాలని భోజనం పెడుతున్నారు.. మా వార్డెన్తో మాట్లాడం సార్’ అంటూ ఉలవపాడు ఎస్సీ బాలుర వసతి గృ హం విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు విన్నవించుకున్నారు.
ఒంగోలు నగర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గసమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్ సెంటర్, త్రిపురాంతకం రోడ్డులోని ఇద్దరు వ్యాపారులు ఈ నెల 7వ తేదీన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. ఆ వ్యాపారులకు కేటుగాళ్లు టోకరా వేశారు.