• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం

వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం

ప్రజలకు మెరు గైన వైద్యసేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఖాళీగా ఉన్న స్థానాల్లో మెడికల్‌ ఆఫీసర్‌లను నియమిస్తోంది.

చెరువు పనులు ఇక చకచకా!

చెరువు పనులు ఇక చకచకా!

కనిగిరి నియోజకవర్గంలోని హెచ్‌ఎంపాడు మండలం హాజీపురం చెరువు అభివృద్ధి పనులు చకచకా జరగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యా నికి గురై ఆనవాళ్లు కోల్పోతున్న ఈ చెరువు పునరుద్ధరణకు ప్రజా ప్రభుత్వం రూ.2 కోట్ల ఓఅండ్‌ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నిధులను మంజూరు చేసింది.

మార్కాపురం కలెక్టరేట్‌కు భద్రత కరువు

మార్కాపురం కలెక్టరేట్‌కు భద్రత కరువు

మార్కాపురం జిల్లా ఏర్పాటవగానే పట్టణానికి 4కి.మీ దూరంలో ఉన్న పునరావసకాలనీలోని పాఠశాల భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చారు. ఐదు నెలలుగా భవనాన్ని వివిధ హంగులతో మార్పులు చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా కృష్ణయ్య

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా కృష్ణయ్య

ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకటకృష్ణయ్య నియమితులయ్యారు. ఈమేరకు పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

15న సంతమాగులూరులో ‘మీకోసం’

15న సంతమాగులూరులో ‘మీకోసం’

అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరులో ఈనెల 15న మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మీకోసం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

నోబిడ్‌..!

నోబిడ్‌..!

పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో నోబిడ్‌లు ఎక్కువయ్యాయి. దీంతో రోజువారీ వేలం కేంద్రాలకు నామమాత్రంగా బేళ్లు వస్తున్నాయి. వాటిని కూడా బయ్యర్లు కొనడం లేదు. కొన్ని వేలం కేంద్రాల్లో కొనుగోలు చేసే వాటి కన్నా తిరస్కరణలే ఎక్కువగా ఉంటున్నాయి.

సమ్మర్‌ క్యాంపుల్లో దోపిడీ

సమ్మర్‌ క్యాంపుల్లో దోపిడీ

ఆటలు ఆ శాఖ అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.కోట్లు దోచుకున్న క్రీడా శాఖ తాజాగా ప్రజా ప్రభుత్వంలోనూ చేతివాటాన్ని చూపుతోంది.

బస్సెక్కాలంటే సాహసం చేయాల్సిందే!

బస్సెక్కాలంటే సాహసం చేయాల్సిందే!

వేసవి సెలవులు వచ్చాయంటే ముందుగా గుర్తుకొచ్చేది పల్లెటూర్లు. కనీసం వారంరోజులైనా ఊరు వెళ్లేందుకు అత్యధికశాతం ప్రజలు ఆసక్తి చూపుతారు. మధ్యతరగతి ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అ

లైసెన్స్‌లున్నా.. కార్డులు లేవు!

లైసెన్స్‌లున్నా.. కార్డులు లేవు!

వాహనదారులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించి నెగ్గిన తరువాత వారికి రవాణాశాఖ డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌) మంజూరు చేస్తుంది. ఈ సమయంలో లైసెన్స్‌ ఫీజుతోపాటు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డుల జారీ కోసమంటూ ప్రతి లైసెన్స్‌ హోల్డర్‌ నుంచి రూ.235 వసూలు చేస్తోంది.

ఒంగోలులో భూకంపం

ఒంగోలులో భూకంపం

ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. స్థాని క సీతారామపురం, శర్మా కాలేజీ, దేవుడు చెరువు ప్రాంతా లలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి