ప్రజల చెంతకు సంక్షేమ పథకాలను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
డ్వాక్రా గ్రూపు సభ్యులలో ఇంటికి ఒకరిని వ్యాపారవేత్తగా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య అన్నారు.
రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
వెలిగండ్ల మండలం వెదుళ్లచెరువు పం చాయతీలోని బాలవెంగణపల్లికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కనిగిరి అమరావతి గ్రౌండ్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఆధ్యర్యంలో ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి సమక్షంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కందుకూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో నెలరోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఉన్నాయి. జనవరి 1 నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి తప్పించి తిరిగి పూర్వ ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
ఉపాధ్యాయులు విద్యనందించడంతోపాటు విద్యార్థుల సంరక్షకులుగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు.
జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ 75శాతం పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు తెలిపారు.
ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులన్నీ మార్చి 15 లోగా పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించా రు. డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.