• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

ఎప్పుడిస్తారో..!

ఎప్పుడిస్తారో..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రకటించిన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ల కోసం ఎదురుచూపులే మిగిలాయి. గత ఏడాది జూన్‌లో వీటిని అందించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నేటికీ వైద్యశాలలకు కిట్‌లు చేరలేదు.

ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు

ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు

రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రమంత్రుల నుంచి క్షేత్ర స్థాయిలోని బూత్‌ కన్వీనర్ల వరకు వివిధ ప్రాంతా ల్లో తమ పరిధిలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ విజయాలపై ప్రచారం చేపట్టారు.

తేలని ‘ఇతరుల’ లెక్క

తేలని ‘ఇతరుల’ లెక్క

మార్కాపురం జిల్లాలో భూ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌లోనూ రెవెన్యూ సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వాటిని పరిష్కరిం చడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది.

అయినా... నోబిడ్‌!

అయినా... నోబిడ్‌!

దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఆశించిన విధంగా మెరుగుప డటం లేదు. మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కసరత్తు చేస్తుండటం.. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు దృష్టిసారించడంతో పరిస్థితి మారుతుందని రైతులు ఆశించారు.

రివర్షన్‌ టీచర్లకు హైకోర్టులో ఊరట

రివర్షన్‌ టీచర్లకు హైకోర్టులో ఊరట

స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొంది వివిధ కారణాలతో రివర్షన్‌ తీసుకొని మళ్లీ సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. ఉపాధ్యాయుల జిల్లాల విభజనకు సంబంధించిన సీనియారిటీలో ఎస్జీటీలుగా వీరి మొత్తం సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఉత్సాహంగా తేరాతేజీ

ఉత్సాహంగా తేరాతేజీ

కంభం చెరువు కట్టపై తేరాతేజీ (గరికతొక్కుడు) పండుగను ముస్లింలు సోమవారం వైభవంగా నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపురం, మార్కాపురం జిల్లాల నుంచి 3వేల మందికిపైగా తరలివచ్చారు.

బీరువాలో నగలు చోరీ

బీరువాలో నగలు చోరీ

బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాత కక్షలతో ఇరువర్గాల ఘర్షణ

పాత కక్షలతో ఇరువర్గాల ఘర్షణ

పాతకక్షల నేపథ్యంలో పీసీపల్లి మండలం పెదయిర్లపాడు దళితకాలనీలో ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది.

బాలికకు పాముకాటు.. పరామర్శించిన మంత్రి

బాలికకు పాముకాటు.. పరామర్శించిన మంత్రి

కొండపి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొండపి గ్రామ పంచాయతీలోని ముక్కోడిపాలేనికి చెందిన కడియం మోక్షితను ఆదివారం గురుకుల పాఠశాలలో అన్నం తింటుండగా ఓ పాము కాలుకు చుట్టుకుని కరిచింది. వెంటనే ఆ అమ్మాయి కాలును విదిల్చడంతో పాము పక్కన పడింది.

చెర వీడేనా?

చెర వీడేనా?

వందెకరాల ప్రభుత్వ భూమి. ఎంతోకాలంగా కబ్జాకు గురైంది. ఆక్రమణదారుల్లో పేదలు కొంతమందే. వారి ముసుగులో పెద్దలే అధికంగా ఉన్నారు. ఐదు, పది ఎకరాల ఇసుక భూమిని తమ పలుకుబడితో ఆక్రమించారు. యథేచ్ఛగా బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి