శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తి కాగా, కొత్తగా మరో 20కోట్ల రూపాయలతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించనున్నారు.
బల్లికురవ మండలంలోని అంబడిపూడి గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే తాగునీరు వారం రోజుల నుంచి బంద్ అయ్యింది. దీంతో నాలుగు గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయింది.
పంగులూరు, మండలంలోని ముప్పవరం ప్రధాన కూడలిలో 16వ నెంబరు జాతీయ రహదారి ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది
కందుకూరు మున్సిపాలిటీకి ఆర్థిక పరిపుష్టి కల్పించటం, మధ్యతరహా ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో నివాసస్థలం అందించటమే లక్ష్యంగా ఏర్పాటైన ఎంఐజీ లే అవుట్ లక్ష్యానికి అధికారులు తూట్లుపొడుస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్నట్లు లారీ డ్రైవర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు.. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు వెనువెంటనే స్పందించి లోకేషన్ ఆధారంగా అతని ప్రాణాలు కాపాడారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పెంచిన ఫీడ్ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రొయ్యలు రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు.
జిల్లా కేంద్రం మార్కాపురంలో ఈనెల 17వ తేదీ బుధవారం జరుగనున్న రెండేళ్ల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాదరణతో దూసుకుపోతోందని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్లో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం ఘనం గా జరిగింది.
మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించనున్నారు.
త్యం యోగా సాధన చేయటం ద్వారా ఆరోగ్య భాగ్యం కలుగుతుందని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సాధనలో భాగంగా సోమవారం ఉదయం కొత్తపట్నం పల్లెపాలెం సముద్రతీరంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.