మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు గాడి తప్పింది. అండన్వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక సీడీపీవో ఏడాది కాలంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది సూపర్వైజర్లకు గాను ముగ్గురే ఉన్నారు. దీంతో ఆదివాసీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పోషకాహారం పూర్తి స్థాయిలో అందడం లేదు. సర్వసభ్య సమావేశంలో పలుమార్లు ఈ సమస్యను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం ఆదివాసీల పాలిట శాపంగా మారింది.
ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం(ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్)లో భాగంగా ఉద్దేశించిన ప్రగతిని సాధించాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నీతి అయోగ్ ప్రతినిధి కార్తిక్ రెడ్డిలతో కలిసి బుధవారం రాత్రి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం అమలు చేస్తున్నదన్నారు.
విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలను సాధిస్తూ సంపాదించాలన్నదే శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఎస్ఐయూ) లక్ష్యం.
ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు.
పార్టీలైన్ దాటి ఎవరు ప్రవర్తించినా, పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా ప్రవర్తించినా సహించేది లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు
రైల్వే కోడూరుకు గాలేరు-నగరి జలాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
జిందాల్ భూముల్లో నిర్మితమయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎఈ) పరిశ్రమలపై నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధికి తప్పకుండా భరోసా లభిస్తుందని ఆశ పడుతున్నారు. వలస వెళ్లాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదని భావిస్తున్నారు.
బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు.