సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అమలు చేసే వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మండలంలోని చింతలవీధిలో గురువారం వీబీ జీరామ్జీ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కన్నెలకట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ ప్రాణాలకు తెగించి గెడ్డ దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
మండలంలోని దక్షిణకొట్టాలు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు
జీకే వీధి మండలం సీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో ని ధారకొండ, దుప్పులవాడ బీట్లో గురువారం 10 వేల సీడ్బాల్స్ వెదజల్లారు. ధారకొండ సెక్షన్ ఆఫీసర్ సతీశ్ ఆధ్వర్యంలో దుప్పిలివాడ పంచాయతీ దబ్బకోట గ్రామంలో నాలుగు వేల సీడ్బాల్స్ వెదజల్లారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అంటే ఒకప్పుడు కేవలం డ్రాపవుట్ బాలికల కోసం ఏర్పాటు చేసినవనే భావన ఉండేది. కానీ అందులో సకల సదుపాయాలు కల్పిస్తూ ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండడంతో నేడు కేజీవీబీల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు.
వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు
జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలో కొత్తగా నిర్మించిన మాదిమళ్లు వంతెన వద్ద రోడ్డు ప్రస్తుతం బురదమయమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇది చిత్తడిగా మారింది. దీంతో ఇటుగా రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఎమ్మిగనూరు ప్రాంతవాసులకు వైద్యసౌకర్యాలు అందించే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అపరిశుభ్రత నెలకొని విష సర్పాలకు కేంద్రంగా మారింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన్యంలో గురువారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లోనూ ముసురు ప్రభావంతో జల్లులు, ఒక మోస్తరు వర్షం కురిసింది. ముంచంగిపుట్టు మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ఒనకఢిల్లీ ప్రధాన రహదారిపై అడ్డంగా భారీ వృక్షం పడడంతో మూడు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. తాజా వర్షాలు ఖరీఫ్ వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు అంటున్నారు. కాగా గురువారం కొయ్యూరులో 32.4, అనంతగిరిలో 28.7, చింతపల్లిలో 27.7, పాడేరులో 27.1, పెదబయలులో 25.7, ముంచంగిపుట్టులో 24.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు గాడి తప్పింది. అండన్వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక సీడీపీవో ఏడాది కాలంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది సూపర్వైజర్లకు గాను ముగ్గురే ఉన్నారు. దీంతో ఆదివాసీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పోషకాహారం పూర్తి స్థాయిలో అందడం లేదు. సర్వసభ్య సమావేశంలో పలుమార్లు ఈ సమస్యను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం ఆదివాసీల పాలిట శాపంగా మారింది.