జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో స్థానిక సంస్థలకు అదనపు ఆదాయం కోసం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయాలను అధికారులు పట్టించుకోవడంలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్సులు ఆశించిన మేర ఆదాయం తీసుకురాకపోగా, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి.
వాతావరణ మార్పులతో జిల్లాలో వైరల్ జ్వరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా విభాగాలు జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.
వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్ (వీబీ-జీరామ్జీ) కార్యక్రమం పల్లెసీమల ప్రగతికి గొప్పవరమని, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం వీబీ-జీరామ్జీ కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు.
వర్షాకాలంలోనూ మంచినీళ్ల కోసం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో జనం ఇబ్బందులు పడుతు న్నారు. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు చాలా ప్రాంతాల్లో అందడం లేదు. పైప్లైన్లు పగిపో వడం, లీకేజీలు, ట్యాంక్లను శుభ్రం చేయకపో వడం తదితర కారణాలతో తాగునీరు కలుషిత మవుతోంది. దీంతో సొమ్ములు చెల్లించి ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారు.
మండలంలోని రైవాడ శివారు శ్రీరాంపురంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడన్న ఉద్దేశంతో ప్రియుడి సహకారంతో హత్య చేయించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
శారదా నది అనకాపల్లి పట్టణ పరిధిలో వ్యర్థాలతో కలుషితం అవుతున్నది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వినాయక నిమజ్జన ఘాట్, స్నానాల ఘాట్, వంతెన కింద వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యా సంస్థల్లో పచ్చదనం పెంపుతోపాటు విద్యార్థులకు సమృద్ధిగా ఆక్సిజన్ అందేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘చిట్టడవుల’ పెంపకానికి శ్రీకారం చుట్టింది.
జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు వద్ద గురువారం మధ్యాహ్నం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, రహదారిపై బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులో వున్న వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని మల్లేవేముల గ్రామం అంగన్వాడీ కేంద్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 21 మంది చిన్నారులకు ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు.
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అమలు చేసే వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మండలంలోని చింతలవీధిలో గురువారం వీబీ జీరామ్జీ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.