భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.
జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.
రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.
నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడు అటవీశాఖ అధికారుల కస్టడీలో ఆత్మహత్యకు యత్నించాడు. గత నెలలో రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు సమీపంలో పెద్దపులిని..
తాడిపత్రిలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల వాగ్వాదం, కేకలు, అరుపులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఎల్నినో నేపథ్యంలో పంటల బీమా ద్వారా ప్రతి రైతుకూ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
భోగాపురం ఎయిర్పోర్టులోకి వెళ్లగానే అది ఎయిర్పోర్టులా అనిపించలేదని, మ్యూజియంలా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ అన్నారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాయి! ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో నియమించే యార్డుకమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు!
శ్రీశైలం రిజర్వాయర్లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గుతోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్ నీటిమట్టం పెరగడంలేదు.