రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక మునిపల్ అధికారులు వార్డుల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 వార్డులు వుండగా.. కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, మరికొన్ని వార్డుల్లో తక్కువ జనాభా వున్నారు.
రైస్ పుల్లింగ్ వ్యవ హారంలో రూ.కోట్లు ఆదాయం వస్తుందంటూ తమను నమ్మించి నట్టేట ముంచారని నూజివీడుకు చెందిన బాధితులు వాపోతు న్నారు.
జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రణాళికతో వ్యవహరించడం లేదని, జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజల దాహార్తి ని ఎప్పుడు తీరుస్తారంటూ పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు.
రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
పంట బోదెలు, పంట కాలువల్లో దూకుతూ, ఈదుతూ వేసవి తాపానికి చెక్ పెడతున్నారు.
all are interest to anna centeens అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు.
See you again friend.. జీవితంలో మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా ముగిసిన ఆనందంలో ఉన్న ఆ విద్యార్థులు స్నేహితులను వీడుతున్నందుకు బాధపడ్డారు.
ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతికి జిల్లాలో జై కొట్టారు. కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బాణసంచా కాల్పులతో హోరోత్తించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Jai Amaravati పార్లమెంట్లో అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు సంబరాలు చేశాయి. నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ర్యాలీలు చేపట్టారు. మందుగుండు కాల్చుతూ మద్దతు తెలిపారు.