స్థానిక తాండవ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గంగవరం సర్వే నంబరు 58లో గల జగనన్న కాలనీ(ప్రస్తుతం ఎన్టీఆర్ కాలనీ)లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.
మన్యంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండ ప్రతాపానికి విలవిలలాడుతున్నారు.
అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు (గిరిజన ఉత్సవం) విజయవంతమవుతున్నాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
రోడ్డు సౌకర్యం లేక పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్లో వెళ్లి ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవ విగ్రహం, ఉత్సవాల అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి తల్లిగరగను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
అంతర్ రాష్ట్ర పాలగెడ్డ-ఆర్వీనగర్ రహదారి నిర్మాణాలు ఊపందుకున్నాయి.
గిరిజన ప్రాంతంలో పతో తరగతి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వివిధ పాఠ్యాంశాల్లో స్వల్ప మార్కుల తేడాతో పరీక్షలు తప్పిన విద్యార్థులందరూ పాస్ అయ్యేలా ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లోనూ బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల శిబిరాల్లో బోధన, విద్యార్థుల హాజరును ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ సమీక్షిస్తున్నారు. ఈనెల 4న ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ఈనెల 24తో ముగియనున్నాయి.
అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది.
కర్నూలు నియోజకవర్గంలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక విందు ఇచ్చారు. టాప్-5లో నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.