స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్ తెలిపారు.
రాగోలు జెమ్స్ ఆసు పత్రిలో బ్రెయిన్డెడ్ అయిన 37 ఏళ్ల ఉపాధ్యాయురాలు డి.దేవికారాణి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గిపోతోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంలేదు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పురావడంతో లంబసింగి , పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలంలోని పెద్దగెడ్డ- కొండవంచుల పరిసర 24 గ్రామాలను కలుపుతూ రూ.2 కోట్ల నాబార్డు నిధులతో కూటమి ప్రభుత్వం తారురోడ్డు నిర్మించింది.
మన్యంలో ఎత్తిపోతల పథకాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ పాలనలో మోక్షం కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఆయా పథకాలకు మరమ్మతులు చేపట్టి, రానున్న పదేళ్ల పాటు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీతంపేట ఏజెన్సీలో రైతు సేవా కేంద్రాలు సిబ్బంది కొరతతో అల్లాడుతున్నాయి. గిరిజన రైతులకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో వారికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఏజెన్సీలో ఉన్న 31 సచివాల యాల పరిధిలో ఏడు ఆర్ఎస్కేలు నడుస్తున్నాయి.
మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ పరిధిలోని కాకరపాడు గుహ బాహ్య ప్రపంచానికి పరిచయం కాకపోవడంతో వెలుగులోకి రాకుండాపోయింది.
జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో యంత్రాంగం తలమునకలై ఉంది. ఓటర్ల జాబితా తుదిరూపు కోసం రెవెన్యూ యంత్రాంగం, బీఎల్వోలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి హియరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.