పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నేర్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ సభలో మాట్లాడారు.
ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని, ఎంత మంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని ఆమె అన్నారు.
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా సంబరాలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు.
అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మావిగన్ అంటున్నారని విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతికి చట్టబద్ధత కల్పించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.
జగన్ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు .....