Gouthu Latchanna's Birth Anniversary ‘వెనుకబడిన తరగతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాల సాధనే మనందరి లక్ష్యం కావాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీ యమని వక్తలు కొనియాడారు. ఆదివారం గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోసిగి మేజర్ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో డెంగీ పంజా విసిరింది. కింద మారెమ్మ దేవలయం వెనకాల ఉన్న కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే ఐదుగురు చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు.
మండలంలోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత ఏకపక్ష గ్రామమైన దిబ్బనదొడ్డి రోడ్లు గుంతలమయంగా మారింది. 52- బసాపురంకు మజరా గ్రామమైన దిబ్బదొడ్డి ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్న ఓర్వకల్లు ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు ఈ నెల 18న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజెరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ రానున్నట్లు తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు.
ప్రసుత్తం ఉల్లి పంటపై రైతన్నకు ఆశ పెరుగుతుంది. ఇటీవల ఆశాజనకంగా ధర పలుకుతుండటంతో ఉల్లి సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలలో బావులు, బోర్ల కింద రైతులు ఉల్లిసాగు చేస్తున్నారు.
ప్రజల ముంగిటకే పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలు అత్యంత ఆదరణ పొందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
మండలంలోని బాపురం వద్ద ఏర్పడిన జల వివాదానికి స్వస్తి పలికారు. ఆదివారం కర్ణాటక రాష్ట్ర మంత్రి నాగేంద్ర సోదరుడు ప్రసాద్, తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్ బాపురానికి వచ్చి రైతులతో మాట్లాడారు.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి అన్నారు.