Share News

సంక్షేమ పథకాలకు అత్యంత ఆదరణ

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:50 PM

కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలు అత్యంత ఆదరణ పొందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

సంక్షేమ పథకాలకు అత్యంత ఆదరణ
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, అగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలు అత్యంత ఆదరణ పొందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం జేఆర్‌పురంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. స్ర్తీశక్తి పథకం, తల్లికి వందనం పథకాలు ప్రజల ఆదరణ పొందాయని, మహిళలకు ఈ పథకాలు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.రాము, కూటమి నాయకులు దెయ్యం శ్రీనివాస్‌, పైడి అప్పడుదొర, ఎం.కనకారావు, పిసి ని అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:50 PM