మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు.
బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.
రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లుకు సభ ఆమోదం తెలపడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఢిల్లీ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది.
పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడంపై తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు గురువారం స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నేడు అమరావతి ‘అజేయమైన శక్తిగా అవతరించిందని తెలిపారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఐదు కోట్ల ఆంధ్రులలో పట్టలేని ఆనందాన్ని నింపుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని అన్నారు.