ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు.
బిల్ గేట్స్కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపైన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్వే స్పష్టంగా కనిపించలేదు.
ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..
టీ-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ప్రశంసించారు.
పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్ కొనుగోళ్లలో అక్రమాలు.
ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో .....