పలాసను జిల్లాగా ప్రకటించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాత్రి స్థానిక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డులో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, వివిధ ప్రజాసంఘాల గౌరవాధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని మండలాలను పలాసలో చేర్చి జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద న్నారు.
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. స్థలాలు లేకపోవడంతో పార్కింగ్కు అగచాట్లు తప్పడం లేదు. వాహనాల సంఖ్యతోపాటు జనాభా పెరిగినారోడ్లు విస్తరించడంలేదు. ప్రస్తుత అవసరా లకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో రద్దీ పెరిగితే ట్రాఫిక్ స్తంభించిపోతోంది.
Five goats die in Konchada పొందూరు మండలం కొంచాడలో కుక్కల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 2న కురమాన రమణ, గౌరునాయుడుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా.. 42 గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరోసారి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి.
పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తుహిన్సిన్హా సూచించారు. ఫార్మాసిటీలోని మాన్కైండ్ ఫార్మా పరిశ్రమను గురువారం ఆయన సందర్శించారు.
విద్యను నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెస్ట్ సంగ్యాన్ వార్షిక సంబరాలు ముగిశాయి.
Three arrested for theft ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసై.. వేర్వేరుగా చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అక్కడ ముగ్గురూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. కొన్నాళ్లుగా ముగ్గురూ కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ.. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు చిక్కారు.
‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టు సంస్థలు చేపట్టాలంటే భూ సేకరణ కోసం నిధులు విడుదల చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
Mega Parents Teachers Meeting today ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించనున్నారు.
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.