టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసినట్లు ఒక వీడియో బహిర్గతమైంది. ఆయన్ని హత్య చేస్తే.. డబ్బే డబ్బు అంటూ సదరు వీడియోలో రౌడీషీటర్లు చర్చించుకోంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు.
లేడీ డాన్ అరుణ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ అరాచాకలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వీరికి సాయమందించిన పలువురు రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
ఐదేళ్లు దేవుళ్లని కూడా దోచుకున్నందుకే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పక్కన పెట్టారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన హిందూ దేవాలయాలు, ఆచారాలను కూటమి ప్రభుత్వం పరిరక్షించి ప్రాధాన్యం కల్పిస్తోందనే కడుపుమంటతో జగన్ విష ప్రచారానికి దిగారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.
చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు.
టీడీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపులు వచ్చాయి. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ ఆమెను బెదిరింపులు అందాయి.
కావలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీ రౌడీ మూకలు బుధవారం దౌర్జన్యానికి దిగారు.