నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఏబీఎన్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు నెలకొంది. ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. కౌన్సిలర్లకు ఇంకా 15 రోజులు గడువు ఉండగా.. మున్సిపల్ చైర్ పర్సన్పై తిరుగుబాటు బావుట ఎగురవేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తప్పులు చేయడం.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం అలవాటై పోయిందంటూ కాకాణికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చురకలంటించారు. మతిభ్రమించిన కాకాణి మాటలకు వైసీపీ నేతలే నవ్విపోతున్నారన్నారు.
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇవాళ (శుక్రవారం) మీడియా సమావేశంలో వెల్లడించారు..
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. బాలిక మృతి కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు రావాలని ఆదేశించారు.
నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ సంస్థ కీలక ఒప్పంద కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్. కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి, వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెంతో పాటు పరిసర గ్రామ ప్రజల నేత్ర సంరక్షణే లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.