నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తమిళనాడులోని సీఎంసీ వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్న ఆయనకు గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు.
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.
తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ, గ్రామస్థులతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
జువ్వలదిన్నె ఫిష్షింగ్ హార్బర్కు రూ.2500 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ వల్ల మత్స్యకారులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని తెలిపారు.
నెల్లూరులో రూ.613 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేలు.
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో శంకుస్థాపన చేసిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్.. మారిటైమ్ పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.