Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ABN , Publish Date - Jan 15 , 2026 | 07:40 AM
కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు సమాచారం.
నెల్లూరు: పండుగ పూట పెను ప్రమాదం తప్పంది. కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని మూడు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పలు రైళ్ల ఆలస్యం..
రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు సమాచారం. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..