ప్రజల సమస్యలను అర్జీదారులు పూర్తి సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక రాష్ట్రం పచ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుంగ, భద్ర జలాశయాలకు వరద పోటెత్తింది.
మండల కేంద్రంలో కొన్ని రోజులుగా తాగునీటి కొళాయిలకు రంగుమారి పాచి పట్టిన నీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆ నీటిని తాగేందుకు ఇబ్బంది పడుతున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నల్లమల తీరంలోని తుండ్లవాగు రిజర్వాయర్లో నీటి నిలలు అడుగంటాయి.
మండల కేంద్రంలో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2011లో రూ.10.6 లక్షలతో నిర్మించారు. ఈ వైద్యశాల కింద బోడెమ్మనూరు, పుచ్చకాయపల్లె, కాకరవాడ, రూపనగుడి, సుద్దమల్ల, పడిగెపాడు, ఉయ్యాలవాడ గ్రామాల్లోని 10వేల పశువులు ఉన్నాయి.
: వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టు సాధించుకునేందుకు అధికార, ప్రతిపక్షల నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుపార్టీల నాయకులు తమ నమ్మకస్తులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అన్నట్లు ప్రభుత్వం కూడా సంకేతాలు ఇస్తుంది. దీంతో నాయకులు మరింత పట్టు కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్వోలకు తోడుగా బీఎల్ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
ప్రముఖ సామాజిక, సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత కేసీ కల్కూర నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
గాజులదిన్నె, గంజహళ్లి గ్రామాల రైతుల, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ముందడుగేశారు.
నవోదయ విద్యాల యంలో సీటు కోసం కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.