అత్తింటి వారి వేధింపుల వల్లే శివప్రియ ఆత్మహత్య చేసుకుందని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన శివప్రియ ఉరి వేసుకొని ఉంది. శివప్రియ తల్లిదండ్రులు మంగళవారం ఉదయం మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించి కన్నీటి పర్యంతమయ్యారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఏటా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి నిరుద్యోగ యువతకు తీపి కబురును అందిం చింది.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి బాగా పెరిగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. నగరంలోని త్రిగుణ హోటల్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కుటుంబాల పరిపాలన కొనసాగుతోందని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చాయని ఆరోపించారు
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది చెరువుల్లో చుక్కనీరు కనిపించడం లేదు. దీంతో సాగునీటికి మాత్రమే గాక, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 40శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భజలాలు అండుగంటుతున్నట్లు సమాచారం.
డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల వరదరాజ స్వామి ప్రాజెక్ట్పై ఓ పెద్దపులి పాడిగెదెలను పంజా విసిరిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భదత్రల పరిరక్షణకు పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు.
ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడి ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
జూడాల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు స్తంభించాయి. జూనియర్ డాక్టర్ల చేస్తున్న సమ్మె ప్రభావం పేద రోగులపై తీవ్రంగా పడింది.