: కర్నూలు మండల ఎంపీపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎట్టకేలకు టీడీపీ నెగ్గింది. దీంతో కర్నూలు ఎంపీపీ పీఠంపై పసుపు జెండా ఎగిరింది.
ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ - 2026 కార్యక్రమంలో భాగంగా ఫేస్-1 వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు.
రబీ సీజన్లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి రైతులకు సూచించారు.
కేసీ కేనాల్ ఈఈ, తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈ ప్రతా్పను సస్పెండ్ చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దగ్గర వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.
కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబరు 8న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నైపుణ్యం అభివద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను జేసీ నూరుల్ కమర్తో కలిసి ఆవిష్కరించారు.
పట్టణానికి చెందిన పుల్లయ్య (65)ను నవంబరు నెల 14న హత్య చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం నిందితులను జిల్లా పోలీసు కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో చూపించారు.
కంప్యూటర్ కాలంలో రోజుకో మోసం వెలుగు చూస్తునే ఉంది..ఓ వైపు చదువ ుకున్న వాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతుంటే.. మరో వైపు చదువులేని వాళ్లు కూడా వారి తరహాలోనే మోసాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అమాయక జనం వీరిలాంటి మాటలు విని నిట్టనిలువునా మునిగిపోతున్నారు. మాయ మాటలు చెప్పి వ్యాపారం పేరుతో జనాన్ని మోసం చేసిన సంఘటన పెద్దకడబూరు మండలంలో వెలుగు చూసింది.
పశ్చిమ ప్రాంత ప్రజలు ఆదోని జిల్లా సెంటిమెంట్ను బలంగా వినిపిస్తున్నారు. జిల్లా సాధన కోసం ఉద్యమ జోరు పెంచారు. తమ పిల్లల భవిష్యత్తు.. కరువు పల్లెసీమలు అభివృద్ధికి ప్రత్యేక జిల్లానే ఇంధనమని ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు.
ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుజాత అన్నారు.