జిల్లాలోని కక్షిదారులందరూ జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో పర్యటిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కింద జిల్లాకు మంజూరైన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు.
నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మండలంలోని కేకే కొట్టాల సమీపంలో ఉన్న బిల్వ స్వర్గం గుహల్లో విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబలి’ సినిమా సన్నివేశాలను మంగళవారం చిత్రీకరించారు.
మహిళలపై వేధింపులు దాడులు చేసే వారు ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించబోమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు చేసి విద్యా పాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
నిత్యం ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడే బనగానపల్లె ప్రజలకు రింగ్రోడ్డు నిర్మాణంతో ఊరట కలగనుంది. గత టీడీపీ హయాంలో 2019లో రూ.50కోట్లతో నాటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి రింగ్రోడ్డు నిర్మాణపనులను ప్రారంభించారు
రైతును రాజుగా చేసేందుకే పనిచేస్తున్నామని, వారు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
బాలుర వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులో పక్కపక్కనే ఎస్సీ, బీసీ, బాలుర హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో 88 మంది, బీసీ హాస్టల్లో 158 మందికిపైగా విద్యార్థులు వసతి పొందుతూ చదువుతున్నారు.