శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవు రోజులు కలిసిరావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటంబ సమేతంగా ఒక్కసారిగా రావడంతో క్షేత్ర పుర వీధులు కిటకిటలాడాయి
నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ కే.శ్రీనివాస్ ఉత్తమ సేవలందించినందుకు గానూ ఇండియన్ పోలీస్ మెడల్నుసీఎం చేతుల మీదుగా శనివారం అందుకున్నారు.
మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శక్రవారం ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించారు.
కర్నూలు మెడికల్ కాలేజీని గత రెండేళ్లలో అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ వెల్లడించారు.
హంద్రీనీవా కాలువకు నీరు వస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వీడి చెరువులను నింపాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ప్రజల సంక్షే మం కోసం పోస్టల్ శాఖ పలు పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలందరూ సద్వినియో గించుకోవాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.
ఎల్లెల్సీకి ‘ఇసుక గోడ’..!
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు ఆదేశించారు.
స్వాతంత్య్ర సమర వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.