బీసీ సంక్షేమానికి తొలి మూడు బడ్జెట్లలో వరుసగా రూ.39 వేల కోట్లు, రూ.47 వేల కోట్లు, రూ.51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. మూడో బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ బలం నిర్ణయించే విధానాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొంది.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.
టిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
దక్షిణ కొరియా పర్యటనలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.
సౌత్ కొరియాలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్కు కనీస అవగాహన లేదన్నారు.
గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు.
కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు హనుమకొండ రజిని కుమారి, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.