యోనెక్స్ సన్రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈనెల 22న నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం కాగా, రెండు రోజుల పాటు టీం చాంపియన్షిప్ విభాగంలో నిర్వహించారు. బుధవారం నుంచి 87వ సీనియర్ సీ్త్ర, పురుషుల వ్యక్తిగత జాతీయ పోటీలు మొదలయ్యాయి.
రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ చివరి రెండు బ్లాక్లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు.
అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్లకు నాడు వాజ్పేయి సహకారం అందించారని గుర్తుచేశారు.
ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం డిజైన్ చేయించింది.
మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు.
అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ఏసీబీ సోదాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
సిద్ధార్థ వైద్య కళాశాల వసతిగృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. విద్యార్ధులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్గా ఎదిగిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టెక్ స్టూడెంట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున క్వాంటం టాక్ నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన క్వాంటం టాక్ కార్యక్రమంలో టెక్ స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.