ఏపీ హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.
రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మిందే జగన్ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. మూడుసార్లు మూడు మాటలు మార్చిన జగన్ను వైసీపీ శ్రేణులు నిలదీయాలని అన్నారు.
రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.
అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులను మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్కు లేదు... రాదు అని విమర్శించారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.
ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే.. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని జగన్పై ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో జరుగుతున్న సమ్మెను విరమించినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. 10 రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి ధైర్యం చెప్పిన హోం మంత్రి.. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.