రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ట్రైన్లో విజయవాడకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది.
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థుల మాస్ కాపీయింగ్ ఘటనపై తుది నివేదికను కమిటీ సిద్ధం చేసింది. వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన 21మంది విద్యార్థులపై చర్యలకు కమిటీ సిఫార్సు చేసింది.
లేపాక్షి షోరూమ్లు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూమ్లకు నూతన హంగులు ఇవ్వాలని మంత్రి సవిత సూచించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు.
ప్రేమ వివాహం చేసుకున్నారంటూ ఓ జంటతోపాటు ఆ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. అంతేకాకుండా.. గ్రామ ప్రజలపై కూడా కుల పెద్దలు తీవ్ర ఆంక్షలు విధించారు.