Home » Andhra Pradesh » Krishna
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైసీపీని బంగళాఖాతంలో కలిపేద్దామని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేప ట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల స్ర్టాంగ్ రూమ్ను గురువారం పరిశీ లించారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నియోజకవర్గంలో ఈవీఎం కమీషనింగ్ వివరాలు కలెక్టర్కు తెలియజేశారు.
టీడీపీ కూటమి తోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని యార్లగడ్డ సతీమణి జ్ఞానేశ్వరి ప్రజలను అభ్యర్ధించారు. గురువారంటీడీపీ జంక్షన్ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాపులపా డులోని ఇందిరానగర్ ఏరియాల్లో గడపగడపకు ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
జనసేన కార్యకర్త కర్రి మహేష్ కుటుంబసభ్యులపై వైసీపీ నాయకులు దాడిచేసిన ఘటనలో పోలీసుల తీరుపై మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్చార్జి బండి రామకృష్ణలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాజిక పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకు న్నట్లు ఉందని స్థానిక ప్రతిపక్షాల నాయకులు ఆరోపి స్తున్నారు.
రాష్ట్రంలో అరాచక వాదులు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు కూడా లాగేసుకుంటారని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్లు, గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.
Andhrapradesh: పెన్సనర్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు.
అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వస్తే కృష్ణాడెల్టా ఆధునికీకరణ అని నమ్మించారు. కాల్వలకు కొత్తరూపు తెచ్చి, కౌలు రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు.. ఏనాడూ రైతులకు ఉపయోగపడే ఒక్క పనికి కూడా వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది లేదు. పంట నష్టపరిహారం నుంచి ధాన్యం బిల్లులు, మద్దతు ధర వరకూ, యంత్రాల నుంచి రుణాల వరకూ అన్నింటా అష్టకష్టాలకు గురిచేశారు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లోనూ రైతులను గాలికొదిలేశారు. ఫలితంగా బంగారు పంటలకు నిలయమైన కృష్ణాతీరంలో సాగు చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
వందేళ్ల కిందటి మాట.. అది గుడివాడలోని నాగవరప్పాడు గ్రామం. పచ్చగా కళకళలాడే ఆ గ్రామాన్ని కలరా వ్యాపించి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోయిన గ్రామ పెద్దలు సమస్యకు ఓ పరిష్కారం కావాలని నిర్ణయించుకున్నారు. నాటి ఆచార సంప్రదాయాలను అనుసరించి గ్రామానికి ఈశాన్యంలో చెరువు ఉంటే మంచిదనుకున్నారు. గ్రామస్థులందరి కృషితో 90 సెంట్ల విస్తీర్ణంలో చెరువు తవ్వుకున్నారు. నాటి గ్రామస్థుల నమ్మకమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ చెరువు తవ్విన నాటి నుంచి గ్రామంలో మరణాలు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.