పెండింగ్ రహదారుల పనులు ప్రారంభించటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రూ.439 కోట్లతో 400 కిలోమీటర్ల మేర గోదావరి పుష్కర పనులు చేపట్టామన్నారు.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు.
కృష్ణా జిల్లాలోని స్వామి ఆలయ ఆవరణలో ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రాత్రి సమయంలో స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోయింది.
చిలీపట్నం సౌత్ మండల పరిధిలోని కోన గ్రామంలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం కాస్తా, నాటు తుపాకీతో బెదిరింపుల వరకు దారితీసింది.
గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమావేశం నిర్వహించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్పై వర్క్ షాప్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఏడాది జూన్ 7 నుంచి 21 వరకు15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు.
నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లను రూ.4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 2024 ఎన్నికల హామీ మేరకు సూపర్ సిక్స్లో భాగంగా పింఛన్లను రూ.4 వేలకు పెంచారన్నారు. కృష్ణా జిల్లా పోరంకి సుగాలి కాలనీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి ఆమె పింఛన్లను పంపిణీ చేశారు.