ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాస కొరతను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.టి.దామోదర నాయుడు వెల్లడించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు.
ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెనుకొండ పట్టణానికి తాగునీటి సరఫరా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 0.18 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ అయ్యింది.
దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది.
నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒకవైపు వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థ .. మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్ను అప్పగించారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యల పరిష్కారానికి జులై 22న సమావేశం నిర్వహించాలని అధికారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. జీవో నం.3 పునరుద్ధరణకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. మొత్తం 17 కొత్త కోర్సులు ప్రారంభించనుంది. ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్ కేర్ కోర్సులు అమలు చేయనుంది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించిన రిమాండ్ రిపార్టులో కీలక అంశాలను ప్రస్తావించింది.