పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీలు డీలర్లకు అధికారికంగా స్పష్టత నిచ్చాయి. కొండపల్లిలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఆయిల్ నిల్వలు ఉన్నాయి.
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్లు జోరందుకున్నాయి. గతంలో మాజీమంత్రి కొడాలి నాని మద్దతుతో, నేడు కూటమి నాయకుడి అండతో ఓ బుకీనే ఈ జోరు పెంచాడు. రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా.. ఆ తర్వాత పెద్ద చేపల రైతుగా.. తాజాగా బెట్టింగ్ రారాజుగా ఎదిగాడు. చేపల చెరువును వేదికగా మార్చుకుని ఆదివారం నాటి టీ20 ఫైనల్లో రూ.లక్షలు వెదజల్లాడు. సదరు బుకీ గ్యాంగ్ పోలీసులకు చిక్కడంతో వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. బుకీ అరెస్టుతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బడాబాబులు ఉలిక్కిపడుతున్నారు.
రోగ్యాన్ని మెరుగు పర్చుకునేందుకు సైకిల్ను ఎంచుకున్నారు. క్రమక్రమంగా అదే సైకిల్ తన జీవితంలో భాగమైపోయింది. నేడు సైకిల్తోనే దేశాన్ని చుట్టేస్తున్నారీ రావి రమేశ్.
యోగా, నేచరోపతి విభాగానికి సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజుకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్గా బాధ్యతలు అప్పగించింది.
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్ మైక్ను చూసి పరుగులు పెట్టారు. ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లు నమిలారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా కురిసిన వర్షాలు, గాలులకు పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది పంటనష్టం అంచనాలను తయారుచేసి డిసెంబరులోనే ప్రభుత్వానికి పంపారు. అయితే, ఇంతవరకు నష్టపరిహారం విడుదల కాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక మహోత్సవం తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 9.34 గంటలకు కనకదుర్గమ్మ ప్రధానాలయం గోపుర శిఖరానికి మూడు సముద్రాలు, 12 నదుల జలాలతో అభిషేకం చేస్తారు.