పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో లోకేశ్తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
కుల, మత, జాతి, ప్రాంత భావనలు లేకుండా జిల్లా సమగ్రత, పరిరక్షణ, పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అందరం జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు పథకాలు, ప్రణాళికలను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
నందిగామ రెవెన్యూ పరిధిలో పలు ప్రాంతాల నుంచి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అక్రమార్కులు కృష్ణానదిని, మునేటిని యంత్రాలతో కొల్లగొడుతున్నారు. టిప్పర్లు, లారీల ద్వారా హైదరాబాద్కు, ట్రాక్టర్ల ద్వారా సరిహద్దులో ఉన్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు తరలిస్తున్నారు. తెలంగాణా జిల్లాల్లో గిరాకీ ఉండటం, అధికార యంత్రాంగం నుంచి పెద్దగా దాడులు లేకపోవటంతో అక్రమార్కులు నిర్భయంగా ఇసుకను తరలించేస్తున్నారు.
తిరుపతమ్మ, పరివార దేవతామూర్తులు రంగుల ఉత్సవాన్ని పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 28న పల్లకీల్లో విగ్రహాలను ఉంచి జగ్గయ్యపేట నుంచి పెనుగంచిప్రోలులోని ఆలయానికి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో ముందడుగు వేస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండులో సోమవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ విద్యాసాగర్తో కలిసి భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయజెండా రంగులతో కూడిన బెలూన్లను ఎగురవేశారు.
తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.
రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోనే అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో జరిగిన వేడుకల్లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.