ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపనాలు ఈరోజు(శనివారం) ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సేంద్రియ ఆహారం అవసరమని చెప్పుకొచ్చారు.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. రమేశ్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్వేపైనే ఆగిపోయింది.
ఎంపీ కేశినేని శివనాథ్పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర 2026 నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.
ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం (జూన్ 5వ తేదీ) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
పర్యావరణ పరిరక్షణ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలని కోరారు. పర్యావరణ సంరక్షణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని మంత్రి తెలిపారు.
రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.