సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ధైర్యవంతులైన జవాన్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని దేవాలయం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది.
గుంతకల్ - బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్నామని అన్నారు.
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.