• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల

29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల

ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్

అంగన్వాడీల పేరుతో విషప్రచారం.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్

అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు.

‘ప్రపంచ వేదికపై మరెన్నో విజయాలు సాధించాలి’.. అజయ్‌కు పవన్ అభినందనలు

‘ప్రపంచ వేదికపై మరెన్నో విజయాలు సాధించాలి’.. అజయ్‌కు పవన్ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్‌గా నిలిచావని కొనియాడారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు జాతీయ రహదారిపై టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ సురేశ్ మృతి చెందారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి

కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి

గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..

‘నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్‌ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది.

ఏపీలో ‘మీ మార్ట్స్’.. ఎన్‌సీసీఎఫ్‌తో పౌరసరఫరాల శాఖ కీలక ఎంవోయూ

ఏపీలో ‘మీ మార్ట్స్’.. ఎన్‌సీసీఎఫ్‌తో పౌరసరఫరాల శాఖ కీలక ఎంవోయూ

ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌తో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

కృష్ణా జలాల్లో వాటాపై సుప్రీంకోర్టులో విచారణ.. కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

కృష్ణా జలాల్లో వాటాపై సుప్రీంకోర్టులో విచారణ.. కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు మణిహారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు మణిహారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

దేశం ప్రశాంతంగా ఉండటానికి కారణం జవాన్లే: పవన్ కల్యాణ్

దేశం ప్రశాంతంగా ఉండటానికి కారణం జవాన్లే: పవన్ కల్యాణ్

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన జవాన్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి