కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10:50 గంటల నుంచి 11:50 గంటల వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది.
బిహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.
విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏ.పి.యల్) మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏ.పి.యల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హజరవుతారని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరంలో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను నాగబాబు పరిశీలించారు.
విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా. NTTPS) నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ (బూడిద) కాలుష్య సమస్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జనసేన నాయకుడు అక్కల గాంధీ ఈ సమస్యను పవన్ కల్యాణ్కు వివరించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత ఇంటి నుంచే వెన్నుపోటును ప్రారంభించిన జగన్.. వెన్నుపోటు దినానికి కేరాఫ్ అడ్రస్గా మారారంటూ వ్యాఖ్యానించారు.
ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపనాలు ఈరోజు(శనివారం) ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.