అంతర్జాతీయంగా యుద్ద వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.
రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారని మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతోందని మంత్రి తెలిపారు.
ఏపీలో 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది సర్కార్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిపారు.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హోంమంత్రి అనిత హెచ్చరించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ను అధికారులందరూ అనుసరించాలని ఆదేశించారు.
ముంబైలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్పోలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్లు, వాటర్ పార్క్లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రేషన్ అక్రమ బియ్యంతో పట్టుకున్న వాహనాన్ని గంటల వ్యవధిలో విడిపిస్తాడు. సీజ్ చేసిన వాహనాన్ని ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసంటూ సవాల్ విసురుతాడు. తనిఖీలు చేసిన సిబ్బందిపై ఎదురు తిరుగుతాడు. ఎన్ని కేసులు నమోదు చేసినా తన దారి ‘రేషన్’ దారేనంటాడు. అతనే పీడీఎస్ బియ్యం డాన్ కాజా సత్యనారాయణ అలియాస్ జయంతి సత్యం. మొత్తం 41 కేసులు ఉన్న సత్యంపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శీనానాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.