హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుందని పేర్కొన్నారు.
రాజ్యసభలో దేశభక్తి, ‘వందేమాతరం’ విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రాజ్యసభ సమావేశాలలో భాగంగా ‘నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్లు’పై విజయ్ ప్రసంగించారు.
రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్.. చంద్రబాబు కోట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ అజయ్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తండ్రి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ క్రీడా వారసత్వాన్ని అజయ్.. విజయవంతంగా కొనసాగించారని కొనియాడారు.
ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.