ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి మానస ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మానస చదువుకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నెరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె మానస.. తనను చదివించాలంటూ లోకేశ్ను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వేడుకుంది.
వీబీ జీ రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు.
దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు.
ప్రముఖ దర్శకులు భారతీరాజా మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 'యోగాంధ్ర'లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశా పాల్గొన్నారు. జూన్ 21న జరిగే యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి నేటితో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్న మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.