మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా ఇస్తుందని ఆ శాఖ సంక్షేమ, న్యాయ, వక్ఫ్, ఉర్దూ అకాడమి శాఖల మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు దోచుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రెండేళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి, ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు.
అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి, కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే.. అన్నింటినీ అధిగమిస్తూ సుపరిపాలనను అందిస్తున్నామన్నారు.
గొడ్డలి ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లలో గాడిన పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామన్నారు.
పత్తి మొలకలను బతికించుకోవడానికి ఓ రైతు కుటుంబం బిందెలతో నీరు తెచ్చి సాళ్ల వెంట పోశారు. పంట కోసం రైతు పడే శ్రమను తెలియజేస్తుంది. ప్యాలకుర్తి మజారా కొత్తూరుకి చెందిన దూదేకుల అల్లాబకాష్ అనే రైతు వారం రోజుల క్రితం తనకున్న రెండెకరాల్లో పత్తి నాటించాడు. పది రోజుల కిం దట వర్షం కురియడంతో మంచి అదునుగా భావించి విత్తనాలు పెట్టించాడు. అయితే విత్తనాలు పొలంలో నాటించిన అనంతరం వర్షం జాడ లేకపోయింది.
ఏపీఎస్ఆర్టీసీలో దశాబ్దంగా రిక్రూట్మెంట్ జరగడం లేదని సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితోపాటు ఐఆర్, పీఆర్సీ, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని సంస్థ యాజమాన్యానికి ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది.