రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని గుర్తు పెట్టుకో జగన్ అని అన్నారు.
గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని తెలిపారు.
ఏపీలోని యూనివర్సిటీల పాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి వరద ప్రవాహం రాష్ట్రంలోకి తరలివస్తోంది. కృష్ణమ్మ తరలి రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక ప్రారంభమవగా.. గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
ఏపీడీఏఎస్సీఏసీ బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓఆర్టీ.నం128ను జారీ చేసింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుందని పేర్కొన్నారు.