ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై చర్చించారు.
గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. గ్యాస్ దొరకదనే భయం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పారిశ్రామికవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న అల్ర్పాజోలం డ్రగ్ తయారీ కేంద్ర గుట్టును డీఆర్ఐ అధికారులు రట్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 237 కిలోల అల్ర్పాజోలం, 2,860 లీటర్ల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం పల్లెలో పండుగలా జరిగింది. గన్నవరంలోని సూరంపల్లిలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఎక్కడచూసినా పచ్చటి కండువాలు.. చెరగని చిరునవ్వులే కనిపించాయి. సీఎం చంద్రబాబు రైతులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం, సాగుపై వివరణలతో కూడిన సూచనలు అందజేయడంపై కర్షకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ. 6 వేలు ఇస్తున్నామన్నారు. రైతు ఖాతాలో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నామని తెలిపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కి అనుబంధ సంస్థ తానా ఫౌండేషన్(TANA Foundation). ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో“Stitching Hope – Sewing Machines to Empower the Needy” పలు కార్యక్రమాలు చేపట్టింది.
దేవుని చెరువు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏపీ హైకోర్టు అడ్వకేట్ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్ని నిర్భంధించి హింసించినట్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్లపై ఆరోపణలు ఉన్నాయి.