మంత్రి నారాయణ బృందం లండన్కు చేరుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడ పలు ప్రాజెక్టులను మంత్రి అధ్యయనం చేయనున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.
ఇబ్రహీంపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఏబీఎన్లో మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన కామెంట్స్ వచ్చిన వెంటనే తమ నేత ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయని ఆరోపణలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో పేర్కొంది..
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు.
లజ్జబండ డ్రెయిన్ను అక్రమార్కులు చెరపట్టారు. డ్రెయిన్ వెంబడి మడచెట్లను నరికేయడం, రొయ్యల చెరువులు తవ్వేయడం యథేచ్ఛగా సాగిస్తున్నారు. మడక వరకు మడచెట్లను పూర్తిగా నరికేసి చెరువులుగా మార్చేశారు. రూ.3 లక్షలు ఇస్తే చాలు.. డ్రెయిన్ను ఆక్రమించుకునేలా స్థానిక నాయకులు బేరాలు కుదుర్చుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇలాగే వదిలేస్తే మడక నుంచి కప్పలదొడ్డి వరకు కూడా డ్రెయిన్ ఆక్రమణకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. ఉన్నతాధికారులకు, ఉద్యోగుల సంఘ నేతలకు మధ్య వార్లో పదోన్నతులు రావాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఉద్యోగులంతా భావించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన కల్తీ నెయ్యి మూలాలు విజయవాడలోనే ఉన్నాయా? ఈ వ్యవహారంలో నగదును ఇక్కడి వ్యక్తే సరఫరా చేశాడా? అంటే అవుననే సమాధానం దర్యాప్తు సంస్థల నుంచి వస్తోంది. వన్టౌన్కు చెందిన భరతరాయ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ భరతరాయ్ ఎవరన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతుండగా, విజయవాడ పేరు తెరపైకి రావడంతో దర్యాప్తు ఇటువైపు తిరిగింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.