వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పర్యటనకు తాము ఎప్పుడు ఆటంకం కలిగించమని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పరామర్శించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఎన్హెచ్ నెట్వర్క్ అభివృద్ధికి నిరంతరం నిధుల కేటాయింపులు జరపడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్ పెట్టడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ను ఆయన నివాసంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి.
వైసీపీ నేతలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో రాజకీయాలు చేస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో చరిత్రాత్మక ఆర్థిక విజయాన్ని సాధించిందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్ ప్రధాని దూరదృష్టి గల నాయకత్వానికి మరో నిదర్శనంగా నిలిచిందన్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదకపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.