ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కృష్ణాజిల్లాలోని కానూరులో విషాదం చోటు చేసుకుంది. నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ యువతి వైష్ణవి(19) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన వైష్ణవి నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ కోసం కృష్ణా జిల్లాలోని శ్రీ భారతి ఇన్స్టిట్యూట్లో చేరింది.
రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు.
బీసీల కోసం ప్రత్యేక చట్టమంటూ దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల కోసం కొత్తగా తెచ్చే చట్టంపై రెండేళ్ల నుంచి తీవ్ర కసరత్తు చేశామని తెలిపారు.
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్ట్లు, నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భాను ప్రకాశ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవర్ సెక్టార్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేశామన్నారు.
వైసీపీపై బోరుగడ్డ అనిల్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తాడేపల్లిలోని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ నిరసనకు దిగారు. భార్యతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన.. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
2024లో ఎవరూ ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు.