మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల పట్ల జగన్కు, గొడ్డలి పార్టీ నేతలకు ఉన్న గౌరవం ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజ జేష్ఠ తదియ సందర్భంగా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్లో ఏ మంత్రిపై ఏవిధమైన ఆరోపణలు లేవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
విజయవాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ యువ గాయని శ్రీలలిత నివాసానికి కేంద్ర మంత్రి విచ్చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొన్న సీఎం.. లీడర్షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై ప్రసంగించారు.
ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు.
ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్తో పవన్ సమావేశమయ్యారు.
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందన్నారు.