Home » Andhra Pradesh » Kadapa
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా మున్సిపాలిటీ పరిదిలో మాంసం దుకాణాలు మూసివేయాలని మాంసం విక్రయాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు.
మండలంలో మంజూరు చేసిన పీఎం ఆవాస్ యోజన పక్కా గృహాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే రద్దవుతాయని, దాని ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ సొమ్ము వెనక్కు ఇచ్చేయాల్సి వస్తుందని మండల ప్రత్యేక అధికారి పవన్కుమార్రెడ్డి లబ్ధిదారులకు సూచించారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ విజయఢంకా మోగిం చడం, పులివెందుల ప్రజల తీర్పు జగన్కు చెంపపెట్టు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు.
జమ్మలమడుగులోని తాడిపత్రి-్డ కోవెలకుంట్ల వెళ్లే రోడ్డులో మూడు రోడ్ల కూడలి వద్ద గుంతలు పడి వర్షపునీరు నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజ యం సాధించడంతో ఆపార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ భారీ విజయం సొంతం చేసుకుంది.
పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డినేనని.. రీ పోలింగ్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.