Home » Andhra Pradesh » Kadapa
ఇటీవల పూర్తయిన ముద్దనూరు-తాడి పత్రి నేషనల్ హైవే-67 పై ఏర్పాటు చేసిన విద్యుతదీపాలు వెలగకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.
కేసీ కెనాల్కు నీరు రావడంత ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకున్నాయి.
అట్లూరు మండలంలోని కొండూరు పడమటిభా గం లంకమల అభయారణ్యంలో వెలసిన మూలవిరాట్ కొండగోపాలస్వామి ఆల యం లో శ్రావణమాస శనివారాలు పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త బి.నందగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా, కమనీయంగా నిర్వహించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ ప్రారంభించారు.
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజంపేట ఆర్అండ్బి ఆవరణంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, న్యాయవాది టి.లక్ష్మీనారాయణ, ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్నాయుడు, జిల్లా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అద్యక్షులు గీతాంజలి రమణ తదితరుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా మున్సిపాలిటీ పరిదిలో మాంసం దుకాణాలు మూసివేయాలని మాంసం విక్రయాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు.
మండలంలో మంజూరు చేసిన పీఎం ఆవాస్ యోజన పక్కా గృహాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే రద్దవుతాయని, దాని ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ సొమ్ము వెనక్కు ఇచ్చేయాల్సి వస్తుందని మండల ప్రత్యేక అధికారి పవన్కుమార్రెడ్డి లబ్ధిదారులకు సూచించారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ విజయఢంకా మోగిం చడం, పులివెందుల ప్రజల తీర్పు జగన్కు చెంపపెట్టు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు.
జమ్మలమడుగులోని తాడిపత్రి-్డ కోవెలకుంట్ల వెళ్లే రోడ్డులో మూడు రోడ్ల కూడలి వద్ద గుంతలు పడి వర్షపునీరు నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజ యం సాధించడంతో ఆపార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.