Home » Andhra Pradesh » Guntur
ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్కుమార్, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసిన లోకేశ్.. జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో వా రం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.20 అడుగులకు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఎల్నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎల్నినో ఎన్ని సవాళ్లు విసిరినా.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వకుండా చివరి వరకు ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు.
‘‘చాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీలో అయినా సరే. అసెంబ్లీ బయట అయినా సరే. ఎక్కడైనా సరే. తేదీ, సమయం మీరే ఫిక్స్ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధం.’’ అని మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్కు మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు.