Home » Andhra Pradesh » Guntur
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు.
గాదె సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు.
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
మొహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు.
పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.