Home » Andhra Pradesh » Guntur
కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్కు నల్లపురెడ్డి శ్రీచరణి ఎంపికయ్యారు. 21 ఏళ్ల ఆమె లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.
సీఎం చంద్రబాబు నాయుడుకు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వర్యయ్య లేఖ రాశారు. సచివాలయ, వార్డు ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎంకు ఆయన సూచించారు.
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు.
ఆధునాతనంగా మోడల్ పోలీస్స్టేషన్ల నిర్మాణం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ తరపున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్ నియమితులయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలతోపాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది.