Home » Andhra Pradesh » Guntur
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ మంగళవారం లీక్ అయింది.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు వండి వార్చిన జగన్ మీడియా సంస్థ సాక్షి.
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.