Home » Andhra Pradesh » Guntur
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
మిథున్ రెడ్డి యూఎస్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వు చేసింది.
రాజధాని అమరావతితోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటిమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కోసం రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని కోర్టకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన రద్దు చేయాలని కోరింది.
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది.