AP Meat Development Corporation: చికెన్ షాపులపై కీలక నిర్ణయం..
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:02 AM
చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కోసం రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, అక్టోబర్ 16: చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు నూతన లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ చికెన్ షాపునకు లైసెన్స్ ఇవ్వాలని భావిస్తుంది. ఏ ఫారం (పౌల్ట్రీ) నుంచి కోళ్లు వచ్చాయి.. వాటిని ఎవరికి విక్రయించారనే అంశాలను ట్రాక్ చేసేలా పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది.
ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. అలాగే వైసీపీ హయాంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలను బయటకు తీసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైతం ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాశ్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇవి..
చికెన్, మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం.
మున్సిపాల్టీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి.. అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవడం.
గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనుగోళ్లను ప్రోత్సహించడం.
స్టెరాయిడ్లు వాడిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడం.
చికెన్ దుకాణాల వ్యర్థాలను తీసుకువెళ్లి.. చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టడం. ఈ వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగని రీతిలో నాశనం చేయడం.
అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించడం. విదేశాలకు గోవులను అక్రమంగా తరలించకుండా ఉక్కుపాదం మోపడం.
పీ 4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాల్టీలు, పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టడం.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను పర్యవేక్షించడం.
ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులో ఉంచి.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ విదేశీ పర్యటన.. కోర్టును ఆశ్రయించిన సీబీఐ
దారుణం.. మద్యం తాగి స్కూల్కు వెళ్లిన విద్యార్థి.. చివరకు..
For More AP News And Telugu News