మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించామని.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిడదవోలులో నిరసన తెలుపుతున్నామని.. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సహా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు.
సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ఏ2 నిందితురాలిగా ఉన్నారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు పని తీరు ఏ విధంగా ఉందనే అంశంపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చిన సర్వే నివేదికలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆదేశించారు.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికను త్రాచుపాము కాటేసింది. ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.
ఏసీ వాటర్ పడుతున్నాయనే కారణంగా అన్నాచెల్లెళ్లపై బ్లేడ్తో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అంతర్వేదిలో రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించునున్న తాగునీటి పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా వారిద్దరూ ప్రారంభించారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.