తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దక్షిణ రైల్వే జోన్ పరిధిలోని నగరి నియోజక వర్గంలో రెండు రైల్వే లైన్ల ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో 88.30 కిలోమీటర్ల పుత్తూరు-అత్తిపట్టు ప్రాజెక్టు కోసం 517.37 కోట్లను కేటాయించారు.ఈ నిధులతో సర్వే పనులతో పాటు భూసేకరణ కూడా పూర్తి చేయనున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, తమిళనాడులోని ఊతుకోట, పాలవాక్కం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్, 159 మైనర్ వంతెనలు నిర్మించాల్సి వుంది.
ప్రముఖ సినీనటి శ్రియ శరణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబరాలతో హోరెత్తించారు.
సత్యవేడు మండలం తొండుకుళి పెద్ద చెరువులో చేపడుతున్న మట్టి తవ్వకాలతో చెరువు పొరంబోకు భూములపై ఆధారపడ్డ రైతుల నోట్లో మట్టి పడినట్లవుతోంది.
వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పల్లెల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్ సుమిత్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు సెల్ఫ్ ఎన్రోల్మెంట్ (సొంతంగా ఆన్లైన్లో నమోదు) కార్యక్రమం జరగనుంది.
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్ అసిస్టెంటు మోహన్తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.
భానుడు భగభగలకు బుధవారం ప్రజలు అవస్థలకు గురయ్యారు. అత్యధికంగా శ్రీరంగరాజపురం మండలంలో 38.4, అత్యల్పంగా బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.