చిత్తూరు జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమల్లో తోతాపురి రకానికి ఒకే ధరను అమలు చేయాలని మామిడి రైతు జిల్లా సంక్షేమ సంఘం డిమాండు చేసింది.
గంగాధరనెల్లూరు మండలంలోని జైన్ ఫాంఫ్రెష్ ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడికాయల లోడ్లతో ట్రాక్టర్ల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది నియోజకవర్గవ్యాప్తంగా రైతులు 100 గొల్లపల్లె గల జైన్ఫ్యాక్టరీకి, తూగుండ్రం దారిలోని జైన్ఫ్యాక్టరీకి పది రోజులుగా తోతాపురి మామిడికాయలను తీసుకొస్తున్నారు.
ప్రకృతి వనరులతో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం జిల్లాలో ఆపసోపాలు పడుతోంది. సూర్యకాంతులతో సోలార్ పలకల నుంచి విద్యుత్ ఉత్పత్తికి పలు కారణాలు మబ్బుల్లా అడ్డుపడుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.
వాకాడు మండలంలోని తూపిలిపాళెం సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. పాఠశాలలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు, ఎన్డీయే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
మదనపల్లె మార్కెట్లో నెల రోజులుగా కిలో రూ.25 నుంచి రూ.33 మధ్య ఊగిసలాడుతున్న టమోట ధరలు ఆదివారానికి రూ.41కి చేరుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇదే గరిష్ట ధరగా నమోదైంది.
‘ధైర్యస్పర్శ- ఆపరేషన్ ఫ్లష్ అవుట్’లో భాగంగా ఆదివారం జిల్లాలో డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 70 మందికి పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కాణిపాకంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోపల క్యూలైన్లు నిండిపోయి వెలువల వరకు కొనసాగింది.