మహా శివరాత్రి సందర్భంగా సోమవారం పాఠశాలలకు ఆప్షన్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి గుడిలో ప్రదోష కాల పూజలను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.
పులిచెర్ల మండలంలో పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన జంట ఏనుగులు పాళెం పంచాయతీ జూపల్లె వద్దకు చేరుకున్నాయి.
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.
శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.
శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణవాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు.
తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో తన లాగిన్ దుర్వినియోగం కాలేదని కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటి పన్నుల పేర్ల మార్పు అంశం డిప్యూటీ కమిషనర్ పరిధిలో వుంటుందని, కమిషనర్ లాగిన్తో ఎలాంటి సంబంధం లేదన్నారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదేశాలతో మదనపల్లె టమోట మార్కెట్లో 15 కిలోల క్రేట్లతో వేలం పాటలు ప్రారంభించారు.
బోయకొండలో అర్చకుల వద్ద డబ్బు వసూలు చేసిన మహిళా జూనియర్ అసిస్టెంట్(కాంట్రాక్ట్)ఉద్యోగి భారతిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.