వైభవంగా ప్రదోష కాల పూజలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:12 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి గుడిలో ప్రదోష కాల పూజలను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి గుడిలో ప్రదోష కాల పూజలను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. మూల విరాట్కుకు, స్వామికి ఎదురుగా ఉన్న మహానందికి ఏకకాలంలో అభిషేకం చేశారు. ఈ పూజలను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు కాణిపాకం క్షేత్రానికి విచ్చేశారు. అభిషేకం పూర్తయిన వెంటనే మూల విరాట్ను, మహానందిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్గురుకుల్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చక, పండితులు పాల్గొన్నారు.