తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మామూలు రోజుల్లో సైతం వీరి సంఖ్య 80 వేలకు పైగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భక్తులకు అందించే సేవలను మరింత మెరుగుపర్చడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శ్రీవారి సేవకుల పనితీరును బేరీజు వేసేందుకు అధికారులు కొత్తగా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సాధారణంగా రోజుకు సుమారు 3 వేల నుంచి 3,500 మంది శ్రీవారి సేవకులు వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి పనితీరును పరిశీలించి ప్రత్యేకంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. తమకు అప్పగించిన పనిని సక్రమంగా చేయడంతో పాటు అదనంగా పనిచేస్తుంటే అత్యుత్తమం అని, అప్పగించిన పనిని బాగా చేస్తే ఉత్తమం అని, సక్రమంగా చేయకపోతే నామమాత్రం అని గ్రేడింగ్ ఇస్తున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్కు ఎంపికైన బృందాల సేవలను బ్రహ్మోత్సవాలు, ప్ర
గతేడాది ఒక్కడే విద్యార్థి. అతడూ వెళ్లిపోయాడు. ఈ విద్యాసంవత్సంలో ఒకటో తరగతిలో మరో విద్యార్థి చేరాడు. ఆ విద్యార్థికి ఒక టీచరు. ఇలా సాగుతున్న గుడిపాల మండలం కమ్మతిమ్మపల్లి ప్రాథమిక పాఠశాలను బుధవారం మూసివేశారు. ఆ విద్యార్థిని పక్క పాఠశాలలో చేర్పించారు. ఇదే తరహాలో నడుస్తున్న కుప్పం మండలం బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. కమ్మతిమ్మపల్లి పాఠశాలను బుధవారం ఎంఈవో హస్సన్ బాషాతో కలిసి డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 29వేలమంది స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పర్యావరణ హిత, కాలుష్య, శబ్ద రహితంగా నడిచే కన్వెర్షన్ ఏసీ ఇంద్ర బస్సు మంగళవారం పూర్తిస్థాయిలో రోడ్డెక్కింది
తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కమీషన్ల వసూళ్ల విషయంలో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఏసీబీ ఆకస్మిక తనిఖీలు రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగాయి. పలు రికార్డులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి మంగళవారం క్లీనింగ్ డేగా ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.
రాపూరు వెలుగొండల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అటవీశాఖ అధికారి ధీరజ్ మంగళవారం హెచ్చరించారు.
సత్యప్రమాణాలకు నిలయమైన రాజలనాలబండ ఆలయాన్ని మళ్లీ దేవదాయశాఖ స్వాధీనం చేసుకోనుంది. ఆశాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాఽథ్ మంగళవారం ఈమేరకు తెలిపారు.
చిత్తూరులోని కమర్షియల్ ట్యాక్స్ జేసీ, డీసీ కార్యాలయాలను తిరుపతికి తరలించడంపై వైసీపీ నాయకులు సోమవారం చిత్తూరులో ఆ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయాలు తరలించి దాదాపు 25 రోజులు దాటాక ఆందోళనకు దిగడం గమనార్హం.
కే ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న ఆ ప్రాథమిక పాఠశాల మూతపడింది. వీరిద్దరినీ పక్క పాఠశాలలకు పంపించారు.