పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.
దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .
కాణిపాకంలో త్వరలో అండర్ గ్రౌండ్ కేబుల్ విదానాన్ని తీసుకురానున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. శనివారం కాణిపాకం వచ్చిన సీఎండీకి , ఎమ్మెల్యే మురళీమోహన్,ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ స్వాగతం పలికారు.
ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ అన్నిరకాల పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వైద్యులు మారినప్పుడల్లా మన ఆరోగ్య వివరాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు.మనకు చేసిన పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యలు, చికిత్స చేసిన వైద్యుడి పేరు.. తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేస్తారు.
సూళ్లూరుపేట మండలంలో నకిలీ వరి విత్తనాలతో రైతులు మోసపోయారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త సంచలనంగా మారింది. సూళ్లూరుపేటలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది.
‘నేను దళితుడిని కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తున్నారు.. అధికారులు ప్రోటోకాల్ పాటించనప్పుడు నాకు ఈ ఎస్కార్టు ఎందుకు..’ అంటూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆక్రోశం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీరం వైపు దూసుకొస్తోందని, ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.