జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇళ్ల గణన 88 శాతంపైగా పూర్తయింది. సర్వే పూర్తి కాని ఇళ్లకు ఆ సంఖ్య ఉండడం లేదు. ఈక్రమంలో జనగణన అధికారి ఇంటికి రాకపోతే వెంటనే 0857224273, 0857224274 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు.
చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సబ్సిడీపై వీటిని పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారులు వారం పదిరోజులుగా చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఖరీ్్ఫలో ఎల్నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో మాత్రం ఈవర్షాదార పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండ విజృంభించినా సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వాన కురిసింది. చిత్తూరు నగరంతో పాటు పరిసర మండలాల్లో హోర్డింగులు గాలికి ఎగిరిపడ్డాయి. భారీవృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గంటన్నర పాటు వర్షం కురిసింది.
టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేసుకున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ స్కాంలో అక్రమ నగదు చలామణి, హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది.
అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఎబోలా వైరస్పై జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
‘తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన కరుణాకర రెడ్డి వ్యవహరిస్తున్నారు. తక్షణం కోట్లాదిమంది హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి’ అని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు డిమాండ్ చేశారు.