Home » Andhra Pradesh » Chittoor
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మా ఉరుకొస్తే చంపేస్తాం’ అంటూ పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో శుక్రవారం వైసీపీ కార్యకర్తలు బీసీవై పార్టీకి చెందిన నలుగురు నాయకులపై కర్రలతో దాడి చేశారు. బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్ కాన్వాయ్లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
చిత్తూరు లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన నామినేషన్ల పరిశీలన ఘట్టం శుక్రవారంతో ముగిసింది. పార్లమెంటు స్థానానికి 56, ఏడు అసెంబ్లీ స్థానాలకు 254 నామినేషన్లు అందాయి. శుక్రవారం జరిగిన పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో మొత్తం 105 మంది అభ్యర్థులు మిగిలారు.
చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మధ్యాహ్న సమయంలో వీధులన్నీ బోసిపోతున్నాయి
టీచర్లకు జగన్ ప్రభుత్వంలో చుక్కలు చూపించారు. ఈ ఐదేళ్లలో ఏ శాఖకూ లేని షరతులు, నిబంధనలు, అదనపు పనిభారం పెట్టి నిత్యం వేధించారు. తాజాగా యూడైస్ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న చిన్ని చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది హెచ్ఎంలకు, 26 మంది ఎంఈవోలకు డీఈవో దేవరాజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూచించారు
తిరుపతిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల అవసరార్థం ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరాన యూజ్ అండ్ పే టాయిలెట్ నిర్మించేందుకు విజయవాడకు చెందిన రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం ముందుకొచ్చింది.
వేసవి కాలంలో రైళ్లలో సాధారణ కోచ్లో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఎకానమీ మీల్స్ అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి రుయాస్పత్రిలో జరుగుతున్న ఆడిట్ తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయల మాయం వెనుక వైసీపీ నేతల ప్రమేయముందన్న ప్రచారం జరుగుతోంది.
వాకాడు మండలంలోని మారుమూల గ్రామమైన పంట్రాంగం కేంద్రంగా కోడిపందేలు, డైమండ్ డబ్బా జోరుగా సాగుతున్నాయి. తడ, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆరంబాకం, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.
సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా మంగళవారం పెద్దఎత్తున తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను ఆదాయపన్నుశాఖకు అప్పగించినట్లు సీఐ వేణుగోపాల రెడ్డి చెప్పారు.