రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతా్పరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులో గురువారం అంగన్వాడీ కేంద్రాలు, రేషన్దుకాణాలతోపాటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పంపిణీ తదితరాలను ఆయన తనిఖీ చేశారు. లొకేషన్ పెట్టుకుని రైల్వేకోడూరులోని ఓ ప్రాంతానికి వెళ్లి రేషన్ పంపిణీని పరిశీలించి, సంతృప్తి చెందారు.
తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్గా తీర్చిదిద్దుతామని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో వాతావరణ అనుకూల సమగ్ర జల నిర్వహణ అనే ప్రతిపాదించిన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీంతో ఏకంగా రూ.750 కోట్ల భారీ ప్రాజెక్టు ప్రతిపాదనకు కదలిక వచ్చింది. తిరుపతి, పరిసరాల్లోని పాతిక చెరువులను అభివృద్ధి చేయడం కీలకాంశం.
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్ అనుమతి లేని బ్లాస్టింగ్ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే విమర్శలొస్తున్నాయి.
బెదిరింపులు, బలవంతపు సెటిల్మెంట్ కేసులో పరారీలో ఉన్న బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు బొంతలపల్లె చంద్రశేఖర్ అలియాస్ శ్రీచందు సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వన్టౌన్ సీఐ రాజారెడ్డి చెప్పారు.
మదనపల్లె డాక్యుమెంట్ రైటర్లు బుధవారం చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం గంగదరగోళంగా మారింది. రిజిస్ర్టేషన్ శాఖలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో గురు, శనివారాల్లో ఈనెల 9, 11 తేదీల్లో నిర్వహించనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఆర్వో కె.మోహన్ కుమార్ తెలిపారు.
రోజంతాకోర్టు ముందు నిలబడి ఉండాలని, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరికి జడ్జి శిక్ష విధించారు చిత్తూరు నగరంలో బుధవారం కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఐదుగురికి రూ.50వేలు జరిమానా విధించా రు. వారిలో ఇద్దరికి జరిమానాతో పాటు రోజంతా కోర్టు ముందు నిలబడేటట్లు శిక్షను విధించారు.
ఏపీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పక్క జిల్లా అయిన కడపలో ఇటీవల ఐదు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తవుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి గతంలోలాగా తీవ్రంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్న చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ బుధవారం మొదలైంది. ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుపుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
శుభమా అని పెళ్లి జరుగుతుంటే కొందరు దుండగులు పెళ్లి మండపంలోనే కత్తులతో దాడిచేసి రక్తపాతం సృష్టించారు. పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో వున్న పద్మావతి కల్యాణ మండపం ఆవరణలో చోటుచేసుకుంది.