మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించారని తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీఎఫ్ ఏఎ్సఐ జి.రాములును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
మూడేళ్లుగా సరైన వర్షాలు కురవని కారణంగా రాయలచెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఖరీ్ఫ సీజన్కు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
తమిళనాడు రాష్ట్రం షోలింగర్లో శుక్రవారం ఉదయం అమృతవల్లి సమేత నరసింహస్వామిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న ఓ గంజాయి స్మగ్లర్ పరారీ కావడంపై ఎస్పీ తుషార్ డూడీ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణను విచారణాధికారిగా నియమించారు.
జన గణనలో మొదటి విడత కార్యక్రమం గృహగణనకు ఆదివారంతో గడువు ముగియనుంది. జిల్లాలో 3039 బ్లాకులు గుర్తించగా ఇప్పటివరకు 1451 బ్లాకుల్లో వందశాతం సర్వే పూర్తయింది.
చిత్తూరు నగరంలో శుక్రవారం 39 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ కాసింది. జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం మబ్బు ముసురుకుంది.
సోమల మండలంలో వారంగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గురువారం రాత్రి ఆవులపల్లె పంచాయతీలోని రాంపల్లె బీట్, పట్రపల్లె, కొత్తూరు సమీపంలోని టమోటా, మామిడి తోటల్లో తిరగాడి పంటలను తొక్కివేసింది.
మైనింగ్ పేరుతో తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, మల్లయ్యకొండల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానికులు, భక్తులు హెచ్చరించారు. శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల నేతలు, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టు సభ్యులు, స్థానికులు మల్లయ్యకొండ కింద అన్నదాన కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
తిరుపతి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది.