వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీని చేసిన పాపాత్ములను త్వరగా శిక్షించు గోవిందా..! అంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వేడుకున్నారు. ఆదివారం నగరంలో జనసేన పార్టీ శ్రేణులతో కలిసి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద నుంచి అలిపిరి గరుడ వలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వీఆర్ఏపై దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాలను రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్ ఆదివారం మీడియాకు తెలిపారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ భక్తుడిపై ఆదివారం మధ్యాహ్నం భద్రతా సిబ్బంది దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
వాయులింగేశ్వరుడిగా పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు ఈనెల 10వ తేదీన కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విరుచుకుపడ్డారు.CFTRI రిపోర్టును తొక్కిపెట్టింది నిజం కాదా?భోలేబాబా డెయిరీకి కొమ్ముకాసింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం విషయంలో జగన్ హయాంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో రసాయనాల వాడకం అనేది కేవలం ఒక సాధారణ తప్పిదం కాదని ఆగ్రహించారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి.. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
డీఆర్డీఏ సిబ్బందికి కలెక్టర్ ప్రశంస