ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి తోతాపురి మామిడిని గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు కొనుగోలు చేస్తుందని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో మామిడి గుజ్జు పారిశ్రామిక యజమానులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల నుంచి చెల్లించే నగదు మామిడి గుజ్జు అమ్మకాన్ని బట్టి రైతులకు పారిశ్రామికవేత్తలు నిధులు అందిస్తారన్నారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ఎక్కువ పంట వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో సోమవారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టారు.
వెంకటగిరికి చెందిన ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులు అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ రేటింగ్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు.తాజాగా విడుదలైన రేటింగ్ జాబితాలో పట్టణానికి చెందిన కలవ దమరేష్ 1498 రేటింగ్, కలవకొల్లు మధుశ్రీతన్ 1442 రేటింగ్ సాధించారు.
తాళాలు వేసి ఖాళీగా ఉన్న 76,412 గృహాలు, తాళాలు వేసిన 730 ఇళ్లను ఈనెల 6వ తేదీలోగా పునఃపరిశీలించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. జన గణనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాలు నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా సమగ్ర శిక్షలోని ఏఎల్ఎ్సవో, ఎంఐఎస్, ప్లానింగ్, ఏఎ్సఓ-2 సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 నాటికి ముగిసింది. దీనిని జూన్ 6వ తేది వరకు పొడిగించినట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈస్ట్ కోస్టల్ పరిధిలోకి చిత్తూరు రైల్వేస్టేషన్ చేరింది. ఈ పరిణామం హర్షణీయమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు.
పొరబాటు ఎక్కడో జరిగింది. దాని ఫలితం చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం తాత్కాలికంగా స్టాంపు పేపర్ల విక్రయాలు ఆగిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎటువంటి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ జరగాలన్నా స్టాంపు పేపర్లు తప్పనిసరి.
తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రోగులను చిరునవ్వుతో పలకరిస్తారు. వారికి ధైర్యం చెబుతారు.
తిరుమలలో ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.