పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని పోరాడి సాధించుకున్న తిరుపతి టౌన్బ్యాంకు ఉద్యోగులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు.
పాత్రలు తోమే స్క్రబ్బర్ ప్యాడ్ల వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి పెద్దమొత్తంలో నగదు వసూలు చేసిన స్క్రబ్ఎక్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన మంగళవారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది.
దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్గా పేరొందిన మదనపల్లె మార్కెట్లో సంక్షోభం నెలకొంది. ఇక్కడి మార్కెట్లో 102 మంది ట్రేడ్ లైసెన్సులు పొంది మండీలు నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా రైతులు తీసుకొచ్చిన టమోటను వ్యాపారులకు విక్రయించి మధ్యవర్తుల పాత్ర పోషిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్లు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించారు.
చిత్తూరు రూరల్ మండలం మంగాపురంలోని ఓ ఇంటి వద్ద హత్య, గ్లాస్ డోర్ పగలగొట్టేందుకు బాంబు వేసిన ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఎలాంటి క్లూ లభించలేదు. దీనికోసం పోలీసులు మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తున్నారు. మంగాపురం, గుడిపాల పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం కూడా అదనపు ఎస్పీ మహబూబ్ బాషా ఘటన జరిగిన ఇంటిని, గ్రామ పరిసరాలను పరిశీలించారు. మరో ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీ చూశారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కె.మోహన్కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు, అదనపు ఏఈఆర్వోలకు సాంకేతిక శిక్షణ నిర్వహించారు.
పూతలపట్టులో వైసీపీ ర్యాలీ సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో ఏఎస్ఐ జ్యోతి గాయపడిన ఘటనలో 27 మంది పార్టీ నేతలపై సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేశారు.
జిల్లాలో 95-95-99 లక్ష్యాల సాధన ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించి, ఎయిడ్స్రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ‘క్యూఆర్ కోడ్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం డీలర్కు చేరవరకు పారదర్శకత కోసం గన్నీ బ్యాగులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. సెప్టెంబరు నెల కోటా నుంచి అమల్లోకి వచ్చే ఈ క్యూఆర్ కోడ్ ప్రక్రియకు సంబంధించి.. మూడు రోజులుగా యంత్రాంగం అమలు చేస్తోంది.
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షి్ప కప్-2026 జిల్లా స్థాయి పోటీలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, బాస్కెట్బాల్, ఆర్చరీ, చెస్ పోటీలు నిర్వహించారు.