రేపు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పచ్చదనం పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2.5కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది.ఇందులోభాగంగా అటవీశాఖ అధికారులు తిరుపతి డివిజన్లో 15లక్షల సీడ్బాల్స్ను వెదజల్లనున్నారు.
విపరీతంగా ఏర్పడుతున్న రద్దీ దృష్ట్యా తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్లో బెంగళూరు ప్లాట్ఫామ్లను మార్చేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీనివాస బస్టాండులోని బెంగళూరు నాలుగు ప్లాట్ఫామ్ల వద్ద స్థలాభావం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దొంగ ఓట్లను తొలగించే ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని బీఎల్ఏలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.తిరుపతి రాఘవేంద్రనగర్లోని జిల్లా బీజేపీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, చంద్రారెడ్డి తదితర నాయకులు స్వాగతం పలికారు.
చిరు వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ పేరుతో తిరుపతిలో బుధవారం వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం శ్రీవారి భక్తుల పాలిట ఇబ్బందిగా పరిణమించింది... అలిపిరి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండానే ఆందోళనకు దిగిన భూమన అభినయ్ సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
మామిడి రైతులకు ఈ యేడాది కూడా ధరలు ఆశాజనకంగా లేవు. మామిడితోటల్లో 70శాతానికి పైగా పండించే తోతాపురి మామిడి కాయలు విక్రయించుకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు.
సాధారణంగా మనం నలుపు, ఎరుపు రంగులో ఉన్న అల్లనేరేడు కాయలను చూస్తుంటాం. అయితే నేరేడు కాయలు తెలుపు రంగులో కూడా కాస్తాయని, అవి తేనె కంటే తీపిగా ఉంటాయని కొంతమందికి మాత్రమే తెలుసు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. చిత్తూరు-బెంగుళూరు హైవే విస్తరణ తర్వాత ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. నిత్యం ప్రమాదాల బారినపడి పలువురు క్షతగాత్రులవుతున్నారు. వీరిని ఉన్నపలాన ప్రైవేటు ఆస్సత్రులకు తరలిస్తుంటే నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అయినా ఇది పెద్దగా ఉపయోగపడటంలేదు. జిల్లాలోని 9 నెట్వర్క్ ఆస్పత్రులకు (ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించే ప్రైవేట్ ఆస్పత్రులు) ఈ పథకం వర్తించేలా అర్హత కల్పించారు. వీటిలో పీఈఎస్ ఆస్పత్రి మినహా మిగిలిన చోట ప్రాణాలు కాపాడేంత సౌకర్యాలులేవు. వైద్య నిపుణులూ లేరని తెలుస్తోంది.
స్వయంభు కాణిపాక వరసిద్ధుని హుండీ ఆదాయం రూ.2,11,98,696 సమకూరింది. ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం స్వామివారి హుండీ కానుకలను ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ో 334 యూఎస్ఏ, 30 కెనడా, 12 సింగపూర్ డాలర్లు, 150 యూఏఈ దిర్హామ్స్, 53 మలేసియా రింగిట్స్ లభించాయి. 28 గ్రాముల బంగారు. 870 గ్రాముల వెండితో పాటు గో సంరక్షణ హుండీ ద్వారా రూ.18,241, అన్న ప్రసాద కేంద్రం వద్ద హుండీ ద్వారా రూ.2,48,609 సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. ఆలయానికి ఈ ఆదాయం 25 రోజుల్లో లభించిందన్నారు. ఈ లెక్కింపులో డీఈవో సాగర్బాబు,చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈవోలు ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సీఎఫ్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇక నుంచి మీ బైక్ దొంగతనానికి గురైతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సీసీటీవీ360 ప్రోగ్రామ్లో భాగంగా బైక్ దొంగ ఎక్కడున్నా క్షణాల్లో పోలీసులు పట్టుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్లో క్షతగాత్రుడ్ని కాపాడుకునే అవకాశమున్నట్లు.. బైక్ దొంగతనానికి గురైన వెంటనే స్థానిక పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేస్తే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండానే సీసీటీవీ360 ద్వారా బైక్ దొంగను పట్టుకుంటారు. ఆలస్యమైతే బైక్ స్వరూపాన్ని మార్చేసే ప్రమాదముంది కాబట్టి.. త్వరగా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. ఈ సీసీటీవీ360 ప్రోగ్రామ్లో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది.
శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయంలోని అన్ని విభాగాలను దశలవారీగా ప్రక్షాళన చేశారు. అయితే పీఆర్వో కార్యాలయ వ్యవస్థలో మాత్రం వేళ్లూనుకునిపోయిన వైసీపీ అక్రమ వసూళ్ల విధానంపై దృష్టి సారించలేదు. ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నప్పటికీ అంతర్గత బదిలీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.2014 నుంచి 2019 వరకు పటిష్టమైన విధానాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయంలోని వ్యవస్థలన్నీ అవినీతిమయంగా మారిపోయాయి.