టమోటా ధరలు పది రోజుల తరువాత నామమాత్రంగా పెరిగాయి. పలమనేరు మార్కెట్ యార్డులో ఫిబ్రవరి ఒకటి నుంచి 15కిలోల బాక్సు రూ.150కే పరిమితమవుతూ వచ్చింది. రెండు రోజులుగా ఈ ధరలు రూ.220నుంచి గరిష్ఠంగా రూ.230 పలుకుతున్నాయి.
కార్వేటినగరం మండలంలో వందలాది కోళ్లు చనిపోయింది బర్డ్ ఫ్లూతోనే అని నిర్ధారణ అయింది. ఈ మేరకు భోపాల్లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ డైరెక్టర్ ఎ.సన్యాల్ నిర్ధారించారు. దీంతో బుధవారం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
పదోన్నతి వచ్చింది. కానీ, నిర్ణీత రెండేళ్లు.. ఆపై మరింత గడువు తీసుకున్నా డిపార్టుమెంటల్ పరీక్షల్లో పాస్ కాలేకపోయారు. ఆ పదోన్నతులను నిలబెట్టుకోలేక పోయారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 19 మందికి సీనియర్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్-1 వీఆర్వోలుగా డిమోషన్ వచ్చింది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, వచ్చే ఎన్నికలు గ్రేటర్లోనే జరగాలని మేయర్ శిరీష కోరారు. మంగళవారం ఎస్వీయూ సెనేట్హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా ఐదవ బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం కాబట్టి టీటీడీ, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలన్నారు.అనంతరం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ఊరుకు దూరంగా వేసిన మాస్టర్ప్లాన్ రోడ్ల వలన అప్పులు తప్ప, అభివృద్ధి లేదన్నారు. మున్సిపల్ భవనాన్ని వైసీపీ హయాంలో 20 శాతం కూడా పూర్తిచేయకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం రాగానే 80 శాతం పనులు పూర్తిచేశామన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు జోక్యం చేసుకుని మిగిలిన 20 శాతం పనులు ఎందుకు పూర్తిచేయలేకపోయారన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందిస్తూ మున్సిపల్ భవనాన్ని పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే ఈస్టు పోలీస్ స్టేషన్ పక్కన గల నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించాలని భావిస్తే రాజకీయ ప్రయోజనాలకోసం రభస చేయడాన్ని గుర్తుచేశారు. ఎలాగైనా మున్సిపల్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడం వలనే పన్నుల ద్వారా కార్పొరేషన్కు ఆదాయం పెరిగిందన్నారు. జనసేన కార్పొరేటర్ ఎస్కే బాబు మాట్లాడుతూ లక్ష్మీపురం జంక్షన్ వద్ద శ్మశానవాటిక , శంకరంబాడి సర్కిల్
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలకు కన్నప్ప ధ్వజారోహణంతో మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తుడికి కొండపై స్థానం కల్పించి తొలి పూజను కూడా అతనికే చెందేలా వరమిచ్చిన వాయులింగేశ్వర స్వామి ఉత్సవాల ధ్వజారోహణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు ముక్కంటి ఆలయంలో పూజలు నిర్వహించారు. కన్నప్ప ఉత్సవమూర్తిని స్వర్ణా భరణాలతో అలంకరించారు.అభిషేక పూజలు నిర్వహించాక మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం ఎదుట ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. ముక్కోటి దేవతలకు సంకల్ప పూజలతో వేదపండితులు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు. ధ్వజారోహణ క్రతువులో భాగంగా కన్నప్ప ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం దర్బ, మామిడి ఆకులతో కట్టిన తెల్లదారంతో ధవళపతాకం, పూలహారాన్ని ఎగురవేసి హారతులను సమర్పించి ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని ముక్కంటి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సన్నిధి వీధిలో బోయ కులస్థులు ఏర్పాటు. చేసిన విడిది మండపంలో కొలువుదీర్చారు. సాంప్రదాయం ప్రకారం ఉభయదారులైన బోయలు వస్త్రం, నైవేద్యం సమర్పించాక గ్రామోత్సవం ప్రారంభమైంది. రాజగోపురం వద్ద నుంచి చతుర్మాడ వీధుల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఽఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తలమండలి సభ్యులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల ఆలయం తరపున పట్టువస్త్రాల సమర్పణ
గ్రామ, వార్డు సచివాలయాలను ఆ మధ్య ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేర్లను మార్చింది. ఈ కార్యాలయాలకు నిర్దిష్ట పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో కార్యాయాల సిబ్బందిని పర్యవేక్షించేందుకు మూడంచెల వ్యవస్థను రూపొందించింది.ఇక నుంచి జడ్పీ సీఈవో స్థాయి అధికారిని ‘జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల అధికారి’గా నియమించనున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో అడిషనల్ కమిషనర్ ‘అర్బన్ స్వర్ణ వార్డు అధికారి’గా.. మండలాల్లో డిప్యూటీ ఎంపీడీవో ‘మండల స్వర్ణ గ్రామ అధికారి’గా పనిచేస్తారు. వీరికి ఇద్దరు చొప్పున సచివాలయ ఉద్యోగులు అసిస్టెంట్లుగా ఉంటారు.జిల్లా అధికారి జిల్లాలోని స్వర్ణ కార్యాలయాలకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ బాధ్యతతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను స్వర్ణ కార్యాలయాల ద్వారా అమలు చేసేందుకు బాధ్యత తీసుకుంటారు. సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తారు.
టీటీడీకి వెళ్ళే నెయ్యి ట్యాంకర్ల వద్ద లంచాలు తీసుకున్న తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగి తంబూరు రాధాకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ ఏకంగా రూ. 3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడీ ఘనుడీయన. సిట్ అధికారులు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా భోలేబాబా డెయిరీకి కమీషన్ ఏజెంట్గా పనిచేసిన పీపీ శ్రీనివాసన్ను ప్రశ్నించడంతో పాటు అతడి వద్ద డెయిరీలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన ఒక డైరీలో తిరుచానూరు మార్కెట్ కమిటీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్మెన్గా పనిచేసే తంబూరు రాధాకృష్ణకు అలిపిరి చెక్ పోస్టు వద్ద రూ. 3.68 లక్షలు లంచం ముట్టజెప్పిట్టు నమోదై వుంది. అది కూడా 2023 ఫిబ్రవరి 27 నుంచీ సెప్టెంబరు 11వ తేదీ వరకూ అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అతడికి లంచంగా ఇచ్చినట్టు నమోదై వుంది. ఆ లెక్కన టీటీడీకి వెళ్ళే ఇతర డెయిరీలకు చెందిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ కూడా తప్పకుండా లంచాలు వసూలు చేసివుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.15 ఏళ్ళుగా అతడు కమిటీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ లెక్కన ఇతర చోట్ల, చెక్పోస్టుల్లో వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాల నుంచీ ఎంతెంత వసూలు చేసివుంటాడోనన్న చర్చ నడుస్తోంది.
నిషేధిత మందులను విక్రయిస్తూ... సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్ ముఠా గుట్టును తిరుపతి ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు. అక్రమ డ్రగ్స్ ముఠా సభ్యులను ఎనిమిది మందిని అరె్స్టచేసి పెద్దఎత్తున నిషేధిత మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.అనంతపురానికి చెందిన లక్కిశెట్టి నాగార్జున అక్కడి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తిరుపతికి చెందిన పాతకమూరి నాగేశ్వరరావుకు నిషేధిత మందులను సరఫరా చేస్తున్నారు. ఆయన వాటిని తిరుపతి పరిసరాల్లో ఆటో డ్రైవర్లు, వలస కూలీలకు విక్రయించడమే కాక.....తనవద్ద మందులు తీసుకుంటున్న వారిని కూడా వ్యాపారులుగా మార్చి వారిద్వారా వ్యాపారాన్ని విస్తరించాడు.ఈస్ట్ పోలీసు బృందం డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతితో కలిసి దాడులు నిర్వహించి చింతలచేను రామతులసి కళ్యాణమండపం వద్ద డ్రగ్స్ ముఠా సభ్యులు 8 మందిని మంగళవారం అరెస్ట్ చేసింది. వారినుంచి 33 బాక్స్ల లెనీడాల్ 100 ఎంజీ టాబ్లెట్లు, 10 ఆస్కారిల్-సి సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లక్కిసెట్టి నాగార్జున, పాతకమూరి నాగేశ్వరరావు, ఆలతూరు రాజ్కుమార్, దిగవింద్లు ఆంజనేయులు, కుడుముల జనార్థన్, మేదూరి గౌతమ్, కోనేటి జగదీ్షబాబు, వెంకటే్షలను అరెస్ట్ చేయగా, ధనలక్మి అలియాస్ ధనమ్మ, పద్మ, చందు, ప్రతాప్, విష్ణు, ప్రదీప్ అనే ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.
టెన్త్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. డిసెంబరు ఒకటిన మొదలైన ఈ కార్యక్రమం మంగళవారానికి 67 రోజులు పూర్తి చేసుకుంది. 65 రోజుల పురోగతి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన థర్డ్ మినిస్టర్స్, సెక్రటరీ కాన్ఫరెన్స్లో సమర్పించింది. ‘సీ’ గ్రేడే ఎక్కువ జిల్లాలోని 353 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 15,812 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి రోజూ ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్టులు పెట్టి, మూల్యాకనం చేసి, మార్కులను విద్యాశాఖ రూపొందించిన యాప్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ప్రీ-ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల గ్రేడింగ్కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఏ గ్రేడ్ (80-100 మార్కులు)లో 1,145 మంది, బీ గ్రేడ్ (60-79 మార్కులు)లో 3991, సీ గ్రేడ్ (35-59 మార్కులు)లో 7027 మంది, డీ గ్రేడ్ (35 మార్కులు)లో 3030 మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. డీ గ్రేడ్పై దృష్టి సారిస్తారా? వంద రోజుల కార్యక్రమం ముగియడానికి 33 రోజులే ఉంది. దీంతో డీ గ్రేడ్లోని 3030 మంది విద్యార్థులను కనీసం పాస్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా వెనకబడిన విద్యార్థులకు నైట్ విజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్ ఇటీవల ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫలితాలు మెరుగుపడే అవకాశం లేకపోలేదు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. పాల వ్యాన్లో సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.