రూ.350కోట్ల బడ్జెట్కు కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:28 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, వచ్చే ఎన్నికలు గ్రేటర్లోనే జరగాలని మేయర్ శిరీష కోరారు. మంగళవారం ఎస్వీయూ సెనేట్హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా ఐదవ బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం కాబట్టి టీటీడీ, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలన్నారు.అనంతరం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ఊరుకు దూరంగా వేసిన మాస్టర్ప్లాన్ రోడ్ల వలన అప్పులు తప్ప, అభివృద్ధి లేదన్నారు. మున్సిపల్ భవనాన్ని వైసీపీ హయాంలో 20 శాతం కూడా పూర్తిచేయకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం రాగానే 80 శాతం పనులు పూర్తిచేశామన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు జోక్యం చేసుకుని మిగిలిన 20 శాతం పనులు ఎందుకు పూర్తిచేయలేకపోయారన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందిస్తూ మున్సిపల్ భవనాన్ని పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే ఈస్టు పోలీస్ స్టేషన్ పక్కన గల నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించాలని భావిస్తే రాజకీయ ప్రయోజనాలకోసం రభస చేయడాన్ని గుర్తుచేశారు. ఎలాగైనా మున్సిపల్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడం వలనే పన్నుల ద్వారా కార్పొరేషన్కు ఆదాయం పెరిగిందన్నారు. జనసేన కార్పొరేటర్ ఎస్కే బాబు మాట్లాడుతూ లక్ష్మీపురం జంక్షన్ వద్ద శ్మశానవాటిక , శంకరంబాడి సర్కిల్
గ్రేటర్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించాలన్న మేయర్
తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, వచ్చే ఎన్నికలు గ్రేటర్లోనే జరగాలని మేయర్ శిరీష కోరారు. మంగళవారం ఎస్వీయూ సెనేట్హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా ఐదవ బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం కాబట్టి టీటీడీ, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలన్నారు.అనంతరం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ఊరుకు దూరంగా వేసిన మాస్టర్ప్లాన్ రోడ్ల వలన అప్పులు తప్ప, అభివృద్ధి లేదన్నారు. మున్సిపల్ భవనాన్ని వైసీపీ హయాంలో
20 శాతం కూడా పూర్తిచేయకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం రాగానే 80 శాతం పనులు పూర్తిచేశామన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు జోక్యం చేసుకుని మిగిలిన 20 శాతం పనులు ఎందుకు పూర్తిచేయలేకపోయారన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందిస్తూ మున్సిపల్ భవనాన్ని పూర్తిచేయాలన్న ఉద్దేశంతోనే ఈస్టు పోలీస్ స్టేషన్ పక్కన గల నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించాలని భావిస్తే రాజకీయ ప్రయోజనాలకోసం రభస చేయడాన్ని గుర్తుచేశారు. ఎలాగైనా మున్సిపల్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడం వలనే పన్నుల ద్వారా కార్పొరేషన్కు ఆదాయం పెరిగిందన్నారు. జనసేన కార్పొరేటర్ ఎస్కే బాబు మాట్లాడుతూ లక్ష్మీపురం జంక్షన్ వద్ద శ్మశానవాటిక , శంకరంబాడి సర్కిల్
పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. వైసీపీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటుకానున్న ఈట్ స్ట్రీట్ వద్ద స్కూల్ గ్రౌండ్ ఉందని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులందరూ వారి డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ మౌర్య బడ్జెట్ అంచనాలను వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.350కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించారు.