వాళ్లిద్దరూ తండ్రీ కొడుకులు. తండ్రి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదివిన కొడుకు ప్రైవేటు ఉద్యోగి. వీరికొచ్చే ఆదాయం చాలడం లేదని దొంగతనాలకు అలవాటు పడ్డారు.
రెవెన్యూ శాఖకు సంబంధించి జోన్-4 పరిఽధిలోని జిల్లాల్లో అర్హత కలిగిన డీటీలకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే.
జిల్లాకు సంబంధించిన నాలుగు కీలక ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు ప్రాజెక్టులకు 76.34 ఎకరాలను మార్కెట్ రేటుకు ఆయా సంస్థలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గుజ్జు ఫ్యాక్టరీల వద్ద తోతాపురి మామిడి కాయల లోడ్లతో ట్రాక్లర్లు బారులు తీరాయి. గంగాధరనెల్లూరు పంచాయతీలోని రెండు జైన్ఫామ్ఫ్రెష్ ఫ్యాక్టరీల వద్ద సుమారు 350 ట్రాక్టర్లు ఉన్నాయి.
చంద్రగిరి మండల పరిధిలోని అగరాల సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి రోడ్డుమీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం బుధవారం కిటకిటలాడింది. స్వామి దర్శనార్థం ఉదయం వేలాది భక్తులు ఆలయానికి విచ్చేశారు.
కారులో తరలిస్తున్న 39.6 కిలోల గంజాయిని (విలువ రూ.11.88 లక్షలు) బుధవారం యాదమరి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ శ్రీధర్నాయుడు, ఎస్ఐ ఈశ్వరరావుతో కలిసి నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు.
చెరువులో లోతు తక్కువ ప్రాంతంలో సరదాగా ఈత కొట్టుకుంటున్నారు. కాస్త ముందుకెళ్లగానే పెద్దగుంతలో పడి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద ఘటన బుధవారం బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట పంచాయతీ బీఎల్ కండ్రిగ పాళ్యంతోపు చెరువులో చోటు చేసుకుంది.
తోతాపురి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వర్చువల్ విధానంలో సమీక్షించారు.
తోతాపురి మామిడి రైతుది మళ్లీ అదే వ్యథ. ఈ ఏడాదీ ధరలు పతనమయ్యాయి. కిలో రూ.ఆరే పలుకుతోంది. అంతకుమించి ఇవ్వలేమంటూ గుజ్జు పరిశ్రమలు చేతులెత్తేశాయి. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.