ధర్మవరం పట్టణంలోని పలు ఆర్ఎంపీ క్లినిక్లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్, తహసీల్దార్ సురేశబాబు, డాక్టర్ సురేశ, ఎస్ఐ ఉమాదేవి, వీఆర్ఓ రవిశేఖర్రెడ్డి పలు క్లినిక్లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.
మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.
మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు.
మండలకేంద్రంలోని ఏపీ మో డల్ స్కూల్లో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల ప్రతి సంవ త్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కనీస మౌలి క వసతులు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యా యులను కూడా నియమించడం లేదు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
స్థానిక రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 25 సంవత్సరైన సందర్భంగా స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దేవదాస్, ధర్మకర్త హనుమంతరాయుడు, గ్రామపెద్దలు తెలిపారు.
క్రిస్టియన మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు.