అనంత నగరంలో వీధికుక్కలు 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాకిస్థాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుక భాగంలో ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణం సందర్భంగా బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన మందులు ఆ బాక్సులో అందుబాటులో ఉంచాలి.
ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదివారం రూరల్ సీఐ నాగేంద్రకు ఫిర్యాదు అందజేశారు. గాండ్లపెంట మండల పరిధి లోని చామాలగొందికి చెందిన హరినాయుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దా ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరి నొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠ శాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల అ పూర్వసమ్మేళానానికి కొత్తచెరువు బాలుర ఉన్నతపాఠశాల వేదికగా మారింది.
తాము చదువుకున్న పాఠ శాలలో నీటి సమస్య ఉన్నట్లు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందిం చారు. పాఠశాలలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి సమస్య నెలకొంది. విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకునేవారు.
ఖరీఫ్లో సాగు చేసిన కందిపంటకు మంచు కురవడంతో కందిపూత దెబ్బతినే అవకాశం ఉం దని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో మండల వ్యాప్తంగా పలువురు రైతులు కందిపంట సాగు చేశారు. అయితే కంది సస్యరక్షణకు ఎన్నో మెళకువలు పాటించి, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేశారు.
మండలపరిధిలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురు గునీటి కాలువల్లో నీరు పారలేక రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా దుర్వాస వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులపై పారుతున్న మురుగునీటిలో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆయా గ్రామస్థులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం సాయంత్రం స్వామివారి నగరోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు.