మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.
పట్టణంలోని మోడల్ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీస్ స్టేషన సర్కిల్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మండలంలోని బ్రాహ్మ ణపల్లి, పూలకుంట, గుర్రబ్బాడు గ్రామాల్లో పెద్దకదిరప్ప స్వామిని సో మవారం పల్లకిలో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని గుంతకల్లు గుత్తి, పామిడి మండలాల్లోని గ్రామాల్లో అన వాయితీగా ప్రతిఏడాది మార్చి నెలలో స్వామి ఉత్సవ విగ్రహాన్నా 25 రోజుల పాటు 35 గ్రామాల్లో పల్లకిలో ఊరేగిస్తామని అర్చకులు రామాం జునేయులు స్వామి తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాడిమర్రి పీఏసీఎస్ చైర్మనగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని స్థానిక అతని స్వగృహంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు అభినందించారు.
మండలంలోని దంపేట్ల గ్రామ సమీపం శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయంలో క్రీ.శ. 1225 నాటి శిలా శాసనాన్ని ఉపాధ్యాయుడు గోపి ఆదివారం గుర్తించారు